Krithi Shetty: ప్రతి ఏడాది వెండితెరకు ఎంతోమంది ముద్దుగుమ్మలు పరిచయమవుతుంటారు. అయితే కొందరు ఒక్క సినిమాకే పరిమితం కాగ మరికొందరు మాత్రం వరుస సినిమా అవకాశాలను అందుకొని దూసుకుపోతుంటారు. అలాంటి వారిలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఒకరు. ఈమె ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఉప్పెనలా తన కెరీర్ లో దూసుకుపోతున్నారు.

కృతి శెట్టి వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈమె ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన నటించిన దివారియర్ సినిమా ఈనెల 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మొదటిసారిగా రామ్ తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ద్వి భాష చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇక ఈ సినిమాలో కృతి శెట్టి రామ్ సరసన సందడి చేశారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి డైరెక్టర్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తన మాతృభాష తుళు అయినప్పటికీ తాను తెలుగు ఎంతో చక్కగా మాట్లాడతానని తెలిపారు.
తమిళం తెలియక ఇబ్బంది పడ్డాను…
తను తెలుగు సినిమా డైరెక్టర్లతో పని చేయటం వల్ల తెలుగు చాలా సులభంగా మాట్లాడగలుగుతున్నానని తెలిపారు. అయితే డైరెక్టర్ లింగుస్వామి తెలుగు తమిళ యాసలో ఉంటుంది. నాకు తమిళం గురించి ఏమాత్రం తెలియదు.ఈ సినిమా షూటింగ్ సమయంలో మొదటి పది రోజులపాటు ఆయన భాష అర్థం కాక ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అయితే హీరో రామ్ కి తమిళం ఎంతో అద్భుతంగా వచ్చు ఆ సమయంలో డైరెక్టర్ లింగు స్వామి గారు చెప్పే విషయాలన్నింటినీ రామ్ తనకు ఎంతో చక్కగా వివరిస్తూ తనకు చాలా సహాయం చేశారని ఈ సందర్భంగా కృతి శెట్టి డైరెక్టర్ గురించి, హీరో రామ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే ఈ సినిమాలో కృతి శెట్టి రేడియో జాకీలా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయింది.





























