Adipurush: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాలీవుడ్ నటి కృతి సనన్ ఇందులో హీరోయిన్ గా నటించారు. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్ నటించిన సీత పాత్రలో కృతి సనన్ నటించారు.

ఇక ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందు డైరెక్టర్ మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఎక్కడైతే రామ పారాయణం జరుగుతుందో అక్కడికి హనుమంతుడు వస్తారని మన హిందువులు భావిస్తారు.
ఇలా హనుమంతుడు వస్తారన్న భావనతోనే ప్రతి ఒక్క థియేటర్లోనూ ఒక సీటు హనుమంతుడి కోసం కేటాయించాలని డైరెక్టర్ చెప్పిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ప్రతి ఒక్క థియేటర్లో డైరెక్టర్ సూచనల మేరకు హనుమంతుడి కోసం సీటును కేటాయించారు. ఇలా దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రసారమవుతున్న చోట హనుమంతుడి కోసం ఒక సీటును ఏర్పాటు చేశారు.

Adipurush:పూజలు చేస్తున్న ప్రేక్షకులు..
ఇలా హనుమంతుడి కోసం సీటు కేటాయించడంతో ఈ సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులందరూ పెద్ద ఎత్తున ఈ సీటులో హనుమంతుడు చిత్రపటాన్ని పెట్టడమే కాకుండా ప్రత్యేకంగా పువ్వులతో అలంకరించి పూజలు చేస్తున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






























