జబర్దస్త్… ఈ కామెడీ షో చూడని బుల్లితెర ప్రేక్షకులు ఉండరేమో.. ఒకానొక సమయంలో పూర్తిగా డౌన్ లో ఉన్న ఈటీవీ టిఆర్పి రేటింగ్లను అమాంతం పైకిలేపింది ఈ జబర్దస్త్ కామెడీ షో. ఈ షోతో లైమ్ లైట్ లోకి వచ్చిన కమెడియన్స్ చాలా మందే ఉన్నారు. కొందరి జీవితాలను ఏమంత్రం మార్చేసింది జబర్దస్త్ షో. అయితే ఒక ప్రయివేటు సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో సంచలనం కామెంట్స్ చేసాడు కమిడియన్ ధన్ రాజ్.

జబర్దస్త్ నుంచి బయటకి వచ్చి జీ తెలుగులో అదిరింది అనే ప్రోగ్రాం చేస్తున్న ధన్ రాజ్ ఒక ఇంటర్వూలో జబర్దస్త్ ప్రోగ్రాం గురించి షాకింగ్ వ్యాఖలు చేసారు. అదిరింది ప్రోగ్రామ్ లో రెమ్యునరేషన్ ఎక్కువ అంత ఎక్కువ ఇవ్వరని.. ఇంకా జబర్దస్త్ లోనే రెమ్యూనరేషన్స్ ఎక్కువగా ఇస్తారని చెప్పుకొచ్చాడు. అదిరింది ప్రోగ్రాం సక్సెస్ కోసం తాము బెంచ్ మార్క్ ఏమి పెట్టుకోలేదని, మొదట్లో 22 ఎపిసోడ్లకు మాత్రమే జీ తెలుగు ఛానెల్ అనుమతి ఇచ్చిందని అయితే అదిరిందిలో మా స్కిట్స్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి జీ తెలుగు యాజమాన్యం దాన్ని 52 ఎపిసోడ్లకు పెంచిందని సక్సెస్ అయింది కాబట్టే యాజమాన్యం ఎపిసోడ్లు పెంచడానికి అనుమతిచ్చింది చెప్పాడు. మరో పక్క యూట్యూబ్ లో కూడా అదిరింది స్కిట్లకు వ్యూస్ మిలియన్ల దాటుతున్నాయని తెలిపాడు.

ఈ సందర్భంగా జబర్దస్త్ జడ్జిలలు నాగబాబు, రోజాలలో మీకు ఎవరైతే ఇష్టం అని అడిగిన ప్రశ్నకు నాగబాబు అంటే తనకు చాలా ఇస్తామని తడుముకోకుండా చెప్పేసాడు. అంతేకాదు తాను మాత్రమే కాదు జబర్దస్త్ కమెడియన్స్ అందరు కూడా రోజా కంటే నాగబాబునే ఇష్టపడతారు అని చెప్పుకొచ్చాడు.




























