Featured

కాబూల్ లో హైజాక్ కు గురైన ఉక్రెయిన్ విమానం.. మళ్లీ మొదలైన భయాందోళనలు..!

ఆఫ్ఘ‌నిస్తాన్ లో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. శాంతిని నెలకొల్పుతామని చెబుతూనే కాల్పులకు పాల్పడుతున్నారు తాలిబన్లు. ప్రతీ పట్టణాన్ని ఆక్రమించుకొని తమ అరాచకాలకు పదను పెట్టారు. దీంతో అక్కడ వాతావరణం మొత్తం మారిపోయింది. అయితే ఇప్పటికీ అక్కడ వేరే దేశాలకు చెందిన కొందరు సిటిజన్లు చిక్కుకుపోయారు.

వారిని తమ దేశానికి తీసుకొచ్చేందుకు వెళ్లిన ఉక్రెయిన్ విమానం అక్కడ హైజాక్ కు గురైంది. కాబూల్ కి వెళ్లిన ఆ విమానం తమ పౌరుల్ని ఎక్కించుకొని తిరిగి స్వదేశానికి వెళ్తున్న క్రమంలో విమానాన్ని గుర్తుతెలియని వ్యక్తులు హైజాక్ చేసి ఇరాన్ కు తీసుకెళ్లినట్లు ఉక్రెయిన్ విదేశాంగశాఖ మంత్రి యెనిన్ ప్రకటించారు. హైజాక్ అయిన విమానంలో 23 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఈ ఘటనతో కాబూల్ కు రాకపోకలు నిర్వహించే అంతర్జాతీయ విమాన సర్వీసులు అన్నీ తాత్కాలికంగా రద్దు చేశారు అధికారులు. పైకి హైజాక్ అని చెప్తున్నా.. సాంకేతికంగా చోరీ జరిగినట్లేనని ఉక్రెయిన్ విదేశాంగశాఖ మంత్రి తెలిపారు. అయితే విమానాన్ని ఎవరు హైజాక్ చేశారు అనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

కాబూల్ ఎయిర్ పోర్టు మొత్తం నాటో, అమెరికా దళాల ఆధీనంలో ఉంది. అక్కడ ఏ విమానం అయినా విదేశాలకు వెళ్లాలంటే అమెరికా సైన్యం అనుమతి అనేది తప్పని సరి. అయినా ఇలా జరగడం అనేది అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. స్వదేశాలకు వెళ్లాలనుకునే పౌరులకు ఈ ఘటనతో మళ్లీ భయాందోళనలకు గురవుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

27 minutes ago

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…

51 minutes ago

ఇకపై దగ్గు మందు కొనాలంటే డాక్టర్ చీటీ తప్పనిసరి.. కేంద్రం కొత్త నిబంధనలు.!

దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…

1 hour ago

కేంద్రం సంచలన నిర్ణయం.. నీట్ రీ-ఎగ్జామ్ ముందు టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం!

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…

1 hour ago

నేటి రాశిఫలాలు.. ఈ రాశుల వారు అడుగడుగునా జాగ్రత్త.. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో అప్రమత్తత అవసరం!

ప్రతిరోజూ ఉదయం చాలా మంది తమ రాశిఫలాన్ని చూసి రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంటారు. గ్రహాల సంచారం,…

3 hours ago

తెలంగాణకు బిగ్ అలర్ట్.. వారం రోజులపాటు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మంత్రి పొంగులేటి హెచ్చరిక

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి…

3 hours ago