ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. శాంతిని నెలకొల్పుతామని చెబుతూనే కాల్పులకు పాల్పడుతున్నారు తాలిబన్లు. ప్రతీ పట్టణాన్ని ఆక్రమించుకొని తమ అరాచకాలకు పదను పెట్టారు. దీంతో అక్కడ వాతావరణం మొత్తం మారిపోయింది. అయితే ఇప్పటికీ అక్కడ వేరే దేశాలకు చెందిన కొందరు సిటిజన్లు చిక్కుకుపోయారు.
వారిని తమ దేశానికి తీసుకొచ్చేందుకు వెళ్లిన ఉక్రెయిన్ విమానం అక్కడ హైజాక్ కు గురైంది. కాబూల్ కి వెళ్లిన ఆ విమానం తమ పౌరుల్ని ఎక్కించుకొని తిరిగి స్వదేశానికి వెళ్తున్న క్రమంలో విమానాన్ని గుర్తుతెలియని వ్యక్తులు హైజాక్ చేసి ఇరాన్ కు తీసుకెళ్లినట్లు ఉక్రెయిన్ విదేశాంగశాఖ మంత్రి యెనిన్ ప్రకటించారు. హైజాక్ అయిన విమానంలో 23 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఈ ఘటనతో కాబూల్ కు రాకపోకలు నిర్వహించే అంతర్జాతీయ విమాన సర్వీసులు అన్నీ తాత్కాలికంగా రద్దు చేశారు అధికారులు. పైకి హైజాక్ అని చెప్తున్నా.. సాంకేతికంగా చోరీ జరిగినట్లేనని ఉక్రెయిన్ విదేశాంగశాఖ మంత్రి తెలిపారు. అయితే విమానాన్ని ఎవరు హైజాక్ చేశారు అనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
కాబూల్ ఎయిర్ పోర్టు మొత్తం నాటో, అమెరికా దళాల ఆధీనంలో ఉంది. అక్కడ ఏ విమానం అయినా విదేశాలకు వెళ్లాలంటే అమెరికా సైన్యం అనుమతి అనేది తప్పని సరి. అయినా ఇలా జరగడం అనేది అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. స్వదేశాలకు వెళ్లాలనుకునే పౌరులకు ఈ ఘటనతో మళ్లీ భయాందోళనలకు గురవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…