గత ఏడాది నుంచి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరిశోధకులు వ్యాక్సిన్ కనుక్కొని ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. అయితే దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ “కోవీషీల్డ్”, “కొవాగ్జిన్” వ్యాక్సిన్లను దేశవ్యాప్తంగా ప్రజలందరికీ వేస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ మనం రెండు డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోస్ వేయించుకున్న నాలుగు వారాల నుంచి 12 వారాల లోపు రెండో డోస్ వేయించుకోవాలి. ఈ క్రమంలోనే వైరస్ ని ఎదుర్కొనే యాంటీబాడీలు మన శరీరంలో ఉత్పత్తి అయి వైరస్ నుంచి మనల్ని రక్షిస్తాయి.
అయితే చాలా మందిలో వ్యాక్సిన్ పట్ల ఎన్నో సందేహాలు తలెత్తుతుంటాయి. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయని? కొన్నిసార్లు మరణం కూడా సంభవిస్తోందని భావిస్తుంటారు. అదేవిధంగా మరికొందరు మొదటి డోస్ “కోవీషీల్డ్”వేయించుకున్న తరువాత రెండవ డోస్ “కొవాగ్జిన్” వేయించుకోకూడదని అలా వేయించుకోవడం వల్ల ప్రమాదాలు మరింత అధికం అవుతాయని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం పై నిపుణులు ఏమంటున్నారంటే..
కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు కోవీషీల్డ్ తీసుకున్నవారు రెండవ డోసు కొవాగ్జిన్ తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు సంభవించవని, ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమేనని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే మొదటి డోసుకోవీషీల్డ్ తీసుకొని రెండవ డోసు కొవాగ్జిన్ తీసుకుంటే వ్యాక్సిన్ ప్రభావం మన శరీరంలో ఏ మాత్రం పని చేయదు. ఈ విధంగా మొదటి డోసు కోవీషీల్డ్ తీసుకొని, రెండవ డోసు కొవాగ్జిన్ తీసుకున్న వారు తిరిగి మరో నాలుగు వారాల తర్వాత రెండవ డోసు కొవాగ్జిన్ తీసుకోవటం వల్ల ఈ వ్యాక్సిన్ మన శరీరంలో యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. అంతేకానీ ఎలాంటి ప్రమాదాలకు దారి తీయదని నిపుణులు తెలియజేస్తున్నారు.
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్లోని కీలక అణు…