ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న కారణంగా మన దేశం మొత్తం లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా తన సర్వీసులను ఏప్రిల్ 30 వరకు నిలిపివేయనున్నట్టు తెలిపింది. దేశీయ మరియు అంతర్జాతీయ విమాన సర్వీసులు సైతం నడపడరాదని ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకుంది. అయితే ఏప్రిల్ 14 తో మన దేశంలో లాక్ డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

మరో పక్క ఇండిగో, స్పైస్ జెట్ మరియు గోఎయిర్ విమానయాన సంస్థలు మాత్రం డొమెస్టిక్ విమాన సర్వేసులను నడిపేందుకు ఏప్రిల్ 15నుంచి టిక్కెట్ బుకింగ్స్ ప్రారంభించాయి. ఇప్పటికే పలువురు ప్రయాణికులు సైతం ఆన్ లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్నట్టు సమాచారం. అయితే అంతర్జాతీయ విమాన సర్వేసులను మాత్రం మే 1 నుంచి ప్రారంభించాలని విమానయాన సంస్థలు యోచిస్తున్నాయి.ఏప్రిల్ 15 నుంచి దేశీయ విమానాలు, మే 1 నుంచి అంతర్జాతీయ విమానాలను నడుపుతామని స్పైస్ జెట్, గో ఎయిర్ విమాన సంస్థల అధికార ప్రతినిధులు ప్రకటించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో విమానయాన సంస్థలు తీసుకున్న ఈ నిర్ణయం సంచలంగా మారింది.

































