బచ్చన్ ఫ్యామిలిలో కరోనా కలకలంతో అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నాలుగు రోజుల క్రితం ఐశ్వర్యరాయ్, కూతురు ఆరాధ్య ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.. అంతకు ముందే అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అప్పటి నుంచి బిగ్ బి, అభిషేక్ ఇద్దరు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఐశ్వర్యరాయ్, ఆరాధ్య మాత్రం హోమ్ క్వారంటైన్ లో ఉండిపోయారు. ఈ విషయాన్ని అభిషేక్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ తెలిపారు.

అయితే తాజగా ఐశ్వర్యరాయ్, తన ఆరాధ్య ఇద్దరు హోమ్ క్వారంటైన్ నుంచి హాస్పిటల్ కు షిఫ్ట్ అయ్యారు. హోమ్ క్వారంటైన్ లో ఉంటే సరిపోతుందని అభిషేక్ ట్వీట్ చేసిన తరువాత అభిమానాలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే నాలుగు రోజులు కావస్తున్నా వీరిలో కరోనా లక్షణాలు తగ్గుముఖం పట్టడం లేదని, కోవిడ్ సంబంధించిన మరిన్ని లక్షణాలు బయటపడటంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం అమితాబ్, అభిషేక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న నానావతి హాస్పిటల్ లోనే వీరిద్దరూ అడ్మిన్ అయ్యారు.




























