Akhil: అఖిల్ అక్కినేని హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటించారు. ఇలా అఖిల్ ఇప్పటివరకు పలు సినిమాలలో నటించిన ఈయనకి మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని చెప్పాలి. ఇలా ఎన్నో అంచనాల నడుమ అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయింది దీంతో అఖిల్ పూర్తిగా సైలెంట్ అయ్యారు.

ఇలా అఖిల్ తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నారని తెలిసినప్పటికీ ఈయన ఎవరి డైరెక్షన్లో ఏ నేపథ్యంలో రాబోతున్న సినిమాలో చేస్తున్నారనే విషయాలు మాత్రం క్లారిటీ లేదు. అయితే అఖిల్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాహో సినిమాకు డైరెక్షన్ విభాగంలో పనిచేసిన అనిల్ కుమార్ అనే దర్శకుడు అఖిల్ కోసం ఒక భారీ కథను సెట్ చేశాడని, పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను యూవీ సంస్థ నిర్మిస్తుందని వార్తలు వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైందని తెలుస్తుంది.
యుద్ధ వీరుడిగా అఖిల్…
మహారాష్ట్రలోని ఓ ఫారెస్ట్ సైలెంట్ గా ఈ సినిమా జరుగుతోందని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాలో అఖిల్ ధీర అనే యుద్ధవీరుడి పాత్రలో కనిపిస్తాడని, ఈ సినిమాకు తారకసింహారెడ్డి అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారని సమాచారం ఇలా ఏ విషయాన్ని అధికారకంగా తెలియజేయకుండా అఖిల్ సైలెంట్ గా సినిమా పనులను పూర్తి చేస్తున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.





























