టాలీవుడ్ అనగానే NTR, ANR పేర్లే వినబడతాయి. వీళ్ళిద్దరూ తెలుగు సినీ రంగానికి 2 కళ్లుగా చెప్పుకుంటారు. ఇప్పుడూ వీళ్ళిద్దరూ లేకపోయినా వాళ్ళ మూడోతరం కూడా తెలుగు సినీరంగంలో కొనసాగుతోంది. అయితే అక్కినేని వంశానికి చెందిన టాలీవుడ్ కింగ్ నాగార్జున తండ్రికి తగ్గ కొడుకులాగే తన టాలెంట్ తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఈమధ్యకాలంలో నాగ్ కొడుకులు నాగచైతన్య, అఖిల్ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. నాగ చైతన్య కొంచెం పర్వాలేదు గానీ, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ తో అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇంతవరకు 3 సినిమాలలో హీరోగా నటించినా సరే, ఒక్క హిట్ కూడా అతని ఖాతాలో పడ లేదు. మొదటి సినిమా ‘అఖిల్’ తోనే పెద్ద డిజాస్టర్ ను మూట గట్టుకుని, అప్పటినుండి హిట్ కోసం తపిస్తున్నాడు అఖిల్. సాధారణంగా కొత్త కథలను తెలుగు ప్రేకకులెప్పుడూ ఆదరిస్తుంటారు. ఇంత వరకూ మాస్ కథల్నీ వదిలీ ప్రేమ కథలను మాత్రమే ఎంచుకున్న అఖిల్ కి అదృష్టం కలిసి రావట్లేదనే చెప్పాలి.
ప్రస్తుతం అఖిల్ తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునే దిశగా అడుగులేస్తూ.. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అఖిల్ సరసన మన టాలీవుడ్ జిగేల్ రాణీ పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని అఖిల్ చాలా పట్టుదలగా ఉన్నాడు. మరోవైపు అఖిల్ తండ్రి నాగార్జున కూడా తన వంతుగా కొడుక్కి మాంచి హిట్ అందించాలనీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలలో భాగంగానే ఈమధ్యనే ఈ సినిమాను చూసిన నాగార్జున సినిమా అవుట్ పుట్ పట్ల సంతోషంగా ఉన్నాడని తెలిసింది. ఇక ఈ సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సమ్మర్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా గత 4 నెలలుగా షూటింగ్ లన్నీ ఆగిపోయి చిత్ర యూనిట్ అంతా ప్రస్తుతం ఎవరి ఇళ్ళకు వాళ్ళే పరిమితమైపోయారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ షూటింగ్స్ ను మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చని అనుమతులు ఇచ్చినా కూడా ఇంకా కరోనా వైరస్ సోకుతుందనే భయంతో ఎవరూ ఈ చిత్రం షూటింగ్ ను స్టార్ట్ చేయడం లేదు.
ఈ నేపథ్యంలో ఈ చిత్ర కధానాయకుడు అఖిల్ మాత్రం కరోనాను సైతం లెక్క చేయకుండా ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న తపనతో డేరింగ్ స్టెప్ వేస్తున్నాడు. ఈయన తన సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ షూటింగ్ ను మళ్ళీ మొదలు పెట్టబోతున్నాడు. మరో 15 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉండటంతో దాన్ని ఎలాగైనా సరే పూర్తి చేయాలని దర్శక, నిర్మాతలు కూడా అఖిల్ అడుగుజాడల్లోనే నడుస్తూ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్, వాసు వర్మ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో అఖిల్ మళ్లీ మేకప్ వేసుకోబోతున్నాడని టాలీవుడ్ టాక్. ఇదే కనుక నిజమైతే ఖచ్చితంగా అఖిల్ తీసుకున్నది డేరింగ్ నిర్ణయమే అవుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ కూడా చాలా వేగంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ షూటింగ్ ను ఎలాగైనా పూర్తి చేసి వీలైనంత తొందరగా కొబ్బరికాయ కొట్టేయాలని చూస్తున్నాడు. చూద్దాం.. ఈసారైనా అఖిల్ సక్సెస్ సాధిస్తాడో లేదో తెలియాలంటే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.!
Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్ లీడర్ ప్రమేయం ఉందని వెల్లడించారు.
ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.
Advertisement
పొలిటికల్ లీడర్.. ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.
Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.
ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.
Advertisement
పార్టీని కాదు, నాయకుడిని చూడాలి.. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.
Advertisement
హీరో నాని.. గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.