Akkineni Naga Chaithanya : అక్కినేని నట వారసుడుగా ‘జోష్’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. తరువాత ‘ఏం మాయ చేసావే’ సినిమాతో విజయాన్ని, పేరును సంపాదించుకున్నాడు. అయితే ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికి బంగార్రాజు సినిమా నుండి వరుస విజయాలు సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా విడుదల అయిన ‘థాంక్యూ’ సినిమా మాత్రం నిరాశను మిగిల్చింది. అయితే నాగ చైతన్య గురించి ఒక వార్త ఆసక్తికరంగా వుంది. నాగ చైతన్య ఒక విషయంలో చిరంజీవి, రామ్ చరణ్ లను మించిపోయాడు అంటున్నారు.

చిరంజీవి, రామ్ చరణ్ లను మించిపోయిన నాగ చైతన్య…
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్ల క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. అయితే ఏ విషయంలో చిరంజీవి, రామ్ చరణ్ లను నాగ చైతన్య మించిపోయాడా అని అందరు అనుకుంటున్నారు. నాగ చైతన్య సినిమాలు, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఈ మెగా హీరోలని దాటే అవకాశంలేదు. కాకాపోతే ఓ విషయంలో మాత్రం మించిపోయాడు.

తాజాగా నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘థాంక్యూ’. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ నష్టాల్ని చూసింది. హైద్రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గల సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో నాలుగో రోజు ఉదయం ఆట వసూళ్ళ కేవలం 12,440 రూపాయలు మాత్రమే రాబట్టగలిగింది. అయితే ‘ఆచార్య’ సినిమా ఇదే రోజు, ఇదే షోకి 12,309 రూపాయలతో సరిపెట్టుకోవడం జరిగింది. అందుకే ఈ విషయంలో చూస్తే రామ్చరణ్, చిరంజీవి ‘ఆచార్య’ సినిమా కన్నా కూడా చైతూమూవీ కాస్త మించిపోయింది అని అభిమానులు సంతృప్తిచెందుతన్నారు.
































