Allari Naresh : ఈవివి సత్యనారాయణ గారి వారసుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. తన మొదటి సినిమా అల్లరి కావడంతో తన పేరు అల్లరి నరేష్ గా మారిపోయింది. హాస్య ప్రధానమైన పాత్రలే కాకుండా నటనకు ప్రాముఖ్యం ఉన్న పాత్రలు అయిన ప్రాణం, గమ్యం, శంభో శివ శంభో, నేను వంటి సినిమాలలో నటించి అందరినీ మెప్పించారు. ఈతరం రాజేంద్రప్రసాద్ అనే పేరు తెచ్చుకున్నారు. అయితే ఈవివి సత్యనారాయణ గారు దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఈవివి బ్యానర్ స్థాపించి చాలా సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. కాకపోతే అయన మరణించాక అల్లరి నరేష్ ఆ బ్యానర్ లో సినిమాలు నిర్మించాలని భావించారు.

ఈసారి నిర్మాణ బాధ్యతలు ఆర్యన్ రాజేష్ కి…
అప్పట్లో ఫ్లాపుల్లో పడి సతమతమవుతున్న ఈవీవీ కి తన సొంత బ్యానర్ ద్వారానే మళ్లీ విజయం వచ్చింది. ఈవీవీ చనిపోయాక ఆ బ్యానర్ పేరు మీద మళ్ళీ మంచి సినిమాల్ని తీయాలని నరేష్ భావించి, బందిపోటు సినిమా నిర్మించాడు. అయితే ‘బందిపోటు’ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాతో నరేష్ చాలా నష్టపోయాడు అంతేకాకుండా ఇక నిర్మాణం గురించి కూడా ఆలోచించలేదు. దాని గురించి ఎవరైనా ప్రస్తావించినా ఇప్పట్లో లేదు అని మొహం మీదనే చెప్పేవాడు. అయితే ఇపుడు తాజాగా మళ్ళీ సినిమాలు నిర్మించాలనే ఆలోచన వచ్చిందట.

ఇపుడు ఓటీటీ అనే మరో వేదిక ఉంది కాబట్టి అల్లరి నరేష్ ఈ సారి సినిమాలు నిర్మించాలని భావిస్తున్నారట. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా నిర్మించాలని చూస్తున్నారట. అయితే ఈసారి మాత్రం నిర్మాణ భాద్యతలు అన్నీ వాళ్ళ అన్న ఆర్యన్ రాజేష్ కు అప్పగించాలని అనుకున్నట్టు సమాచారం. నాంది సినిమాతో మళ్ళీ హిట్ కొట్టినట్టు సినిమా నిర్మాణం విషయం కూడా కలసి వస్తుందేమో చూడాలి.



























