Connect with us

Featured

‘పుష్ప’ చిత్రానికి గానూ బన్నీ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..!

Published

on

అల్లు అర్జున్.. ఫ్యాన్స్ అందరూ బన్నీ, స్టైలిష్ స్టార్ అంటూ మురిసిపోయే మన మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్, 8 Apr 1983 అల్లు అరవింద్ మరియు శ్రీమతి నిర్మల దంపతులకు మద్రాసు లో జన్మించారు. అల్లు అర్జున్ చదువు పూర్తైన తర్వాత యానిమేషన్ కోర్స్ కూడా పూర్తిచేసి కెనడాలో ఉన్నత చదువులు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మెగాస్టార్ ‘డాడీ’ సినిమాలో ప్రత్యెక పాత్రలో నటించే అవకాశమొచ్చింది. ఆ తరవాత వచ్చిన ‘గంగోత్రి’ చిత్రంలో హీరోగా నటించి పూర్తిస్థాయి నటుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు.

హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడిగా, టాలీవుడ్ లోనే పెద్ద నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కుమారుడిగా, మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా అల్లు అర్జున్ టాలీవుడ్ ఎంట్రీ సునాయాసంగానే జరిగింది, కానీ దానిని సద్వినియోగం చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ను ఏర్పరచుకోవటంలో అల్లు అర్జున్ చేసిన కృషిని అభినందించాల్సిందే. గంగోత్రి తరవాత ‘ఫీల్ మై లవ్’ అంటూ ఓ వైవిధ్యమైన ప్రేమికుడి పాత్రలో ‘ఆర్య’ గా యువతరం హృదయాలను దోచుకున్నాడు. ఆర్య చిత్రంతో ఒక్క తెలుగులోనే కాకుండా మలయాళ, కన్నడ ప్రేక్షకుల ప్రశంసలను కూడా అందుకున్నాడు. నేటికీ మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలన్నీ డబ్ అయ్యి విడుదలై బన్నీకి అక్కడ పిచ్చా ఫ్యాన్స్ ఫాలోయింగ్ వుండటం విశేషం. ఆర్య తరవాత విడుదలైన ‘బన్నీ’ చిత్రం సూపర్ హిట్ సాధించడంతో మన స్టైలిష్ స్టార్ కాస్తా కమర్షియల్ హీరోగా స్థిరపడ్డాడు. అప్పట్నుంచి  బన్నీ తాను నటించిన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రత్యేకతను చూపిస్తూ నటనలోనూ, డాన్సులోనూ తనకంటూ ఓ ప్రత్యేమైన స్టైల్ తో ప్రేక్షకులను అలరించాడు. 

‘పరుగు’ లో కృష్ణ గా చక్కని నటనతో అందర్నీ ఆకట్టుకుని, ‘వేదం’ తో టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాల సంస్కృతికి తెరతీశాడు. అక్కడితో ఆగకుండా అంతే కాకుండా ఎవరో బాలీవుడ్ లోని అగ్రహీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా టాలీవుడ్ కు సిక్స్ ప్యాక్ బాడీ కల్చర్ ను పరిచయం చేసిన ఘనత కేవలం ఒక్క అల్లుఅర్జున్ కే దక్కుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ప్రస్తుత విషయానికొస్తే.. మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ ను తీసుకోవడమే కాకుండా.. ఆ సినిమా లాభాల్లో పాతిక శాతం వాటా కూడా తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఈ రూమర్స్ ఎంతవరకూ నిజమా అని ఆరా తీస్తే..

గత సంక్రాంతి సందర్భంగా విడుదలైన ’ అల వైకుంఠపురములో ‘ సినిమా అఖండ విజయం సాధించడంతో అల్లు అర్జున్ అమాంతం తన రెమ్యునరేషన్ పెంచినట్టు, అంతేకాకుండా బన్నీకి మన తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా భారీ ఎత్తున ఫ్యాన్స్ వుండటంతో సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా  వస్తున్న ’పుష్ప‘తో బన్నీ హిందీ, తమిళ మార్కెట్లపై కూడా దృష్టి సారించి, ’అల వైకుంఠపురములో…‘ సినిమాకు రూ.25 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో పాతిక శాతం వాటా తీసుకున్న బన్నీ తాజాగా ’పుష్ప‘ సినిమా కోసం రూ.35 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో పాతిక శాతం అడుగుతున్నాడని తెలిసింది. ఇదిలావుండగా మరోప్రక్క ప్రస్తుతం కరోనా మహమ్మారి భయంతో షూటింగులు అంతంత మాత్రంగానే జరుగుతున్న నేపథ్యంలో బడ్జెట్ విషయంలో ’పుష్ప‘ నిర్మాతలు తర్జనభర్జన పడుతుండటంతో బన్నీ తన రెమ్యునరేషన్ పెంచే అవకాశాలు కనిపించడం లేదని టాలీవుడ్ లోని కొందరు ప్రముఖులు చెబుతున్నారు. ఈ 2 వాదనలలో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియాలంటే మరికొన్ని రోజులు నిరీక్షించాల్సిందే..!

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!