ఏపీ రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ సాగుతున్న ఉద్యమం 600 రోజులు పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతే అంటూ ముక్తకంఠంతో నినదిస్తూ నిరంతరంగా ఉద్యమం నడుస్తోంది. 600 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ర్యాలీ నిర్వహించాలని రైతులు భావిస్తున్నారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు వలయంలో రాజధాని గ్రామాలను నిర్భందించారు.

రాజధాని గ్రామైన తుళ్లూరు చుట్టుపక్కల భారీగా పోలీసులు మోహరించారు. దీక్ష శిబిరం నుంచి రైతులు, మహిళలు బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. తుళ్లూరు- అమరావతి మార్గంలో భారీగా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. బయట వాళ్ళకు గ్రామాల్లోకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీంతో అమరావతి ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.



























