మారుతున్న కాలానికనుగుణంగా ప్రేక్షకుల తీరు, అభిరుచి అన్నీ మారిపోతున్నాయి. ను సినిమాల కంటే నటీనటుల మాటల తూటాలు, పంచ్ డైలాగ్స్ చూసి ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే తాజాగా ఓ బుల్లితెర షోలో పాల్గొన్న ‘అమ్మోరు’ ఫేమ్ సునయన బోల్డ్ కామెంట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. అందరిముందే అమ్మాయిలు, అబ్బాయిలు.. ఆంటీలు అంటూ అడల్ట్ డైలాగ్స్ వదలడంతో ఆ షోలో ఉన్నవాళ్ళంతా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ‘వావ్ 3’షో లో కౌముది, మంగ్లీ, నిఖిల్లతో కలిసి సునయన పాల్గొంది. తాజాగా ఈ షో తాలూకా ప్రోమో వీడియో విడుదలైంది.

సాయి కుమార్ హోస్ట్గా వస్తున్న ఈ షోలో సునయన భలే హుషారుగా కనిపించింది. నిఖిల్కి పంచులేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. ఇందులో భాగంగానే ‘అబ్బాయిలు ఆంటీలతోనే చెకవుట్ చేస్తారు. వాళ్లకు అమ్మాయిలు అంత ఈజీగా పడరు’ అంటూ ఓపెన్ గా హాట్ కామెంట్స్ చేయడంతో ఆ షో హోస్ట్ సాయి కుమార్ తో సహా అంతా షాకయ్యారు. ఈ ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘అమ్మోరు’ సినిమాలో బాలనటిగా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది సునయన. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో అవార్డులను అందుకున్న ఆమె దాదాపు 30 సినిమాల్లో నటించింది. అలా కొన్ని బుల్లితెర సీరియల్స్ లో నటించిన సునయన ప్రేక్షకులను బాగానే అలరించింది.

పెళ్ళైన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్షమై సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈమధ్యనే మళ్ళీ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సునయన “ఓ బేబీ ” చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కూతురిగా తన నటనతో ఆకట్టుకుంది. దీంతో సునయనకు వరుసగా సినిమా ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం సునయన ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు పూరి ఆకాష్ హీరోగా నటిస్తున్న “రొమాంటిక్” చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తుంది.



























