Analyst Adusumilli Srinivasarao : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిణ పరిస్థితులు తెలుగుదేశం పార్టీని ఘోరంగా దెబ్బతీశాయి. ఒకవైపూ ఆంధ్రప్రదేశ్, మరో వైపు తెలంగాణ ప్రజల మనోభావాల నడుమ ఆ ఎన్నికల్లో టీడీపీ తుడిచి పెట్టుకుని పోతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తెరాస, కాంగ్రెస్ మధ్య నేను ఉన్నాను అని నిలబడింది. కానీ మెల్లగా తెరాస లోకి తెలుగుదేశంలో ఉన్న నాయకులాంతా వెళ్లిపోయి పార్టీ కి తెలంగాణలో చోటు లేకుండా చేసారు. కానీ ఇదంతా పైకి మాత్రమే ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం కు సరైన నాయకత్వం లేదు కానీ ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు. ఇది మరోసారి ఖమ్మం చంద్రబాబు మీటింగ్ తో రుజువైంది.

ఆ సభతో ఆ పార్టీకి భయం పుట్టించింది…
చంద్రబాబు బాబు చాలా రోజుల తరువాత తెలంగాణ లో సభ పెట్టారు. అందులో పెద్దగా లీడర్లు టీడీపీ కి లేరు, ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేని ఖమ్మంలో ఆయన సభ పెడితే ఎంతో మంది జనాలు సభకు హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబు ఒక విమర్శ పాలకులను, ప్రత్యర్థులను చేయలేదు కానీ ఈ సభ తరువాత తెరాస పార్టీ నాయకులు స్పందించి విమర్శించారు. ఇక ఈ విషయం గురించి ఆడుసుమిల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీ కి నాయకులు లేరు కానీ కార్యకర్తలు కాదు. ఈ సభలో అదే రుజువైంది అంటూ చెప్పారు. ఒక గుర్తింపు ఉన్న నాయకుడు నడిపిస్తే మళ్ళీ తెలంగాణలో టీడీపీ కి పునర్వైభవం వస్తుంది అంటూ చెప్పారు. టీడీపీ నాయకులను తెరాస కలుపుకున్న టీడీపీ అభిమానులు ఇంకా ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు.

కానీ వారి ఓట్లు ఇప్పుడు టీడీపీ యాక్టీవ్ గా లేదు కాబట్టి చీలుతోంది కానీ ఒక్కసారి టీడీపీ మళ్ళీ ఫామ్ లోకి వస్తే ఖచ్చితంగా ఓట్లు పడతాయి, అధికారాన్ని ఏర్పాటు చేయలేక పోవచ్చు కానీ డిసైడర్స్ గా మారుతుంది. తెరాస అంటే తెలంగాణలో వ్యతిరేకత లేకపోయినా ఈసారి మాత్రం తెరాస ఎన్నికలంటే భయం పట్టుకుంది. సరైన నాయకత్వం వస్తే టీడీపీ ప్రత్యర్థి గా మారుతుందని చంద్రబాబు ను విమర్శించారు. బషీర్ బాగ్ కాల్పుల ఘటన ఎత్తారు. అయితే మరి ఆ తరువాత వైస్సార్ వచ్చినపుడు ముదిగొండ కాల్పులు, సోంపేట కాల్పుల గురించి ఎందుకని షర్మిలను విమర్శించరు. తెరాస కు టీడీపీ భయం ఉంది, ఇప్పుడు విమర్శించిన వారంతా ఒకప్పుడు టీడీపీ వాళ్లే అంటూ ఆడుసుమిల్లి అభిప్రాయపడ్డారు. టీడీపీ వల్ల ఓట్లు చీలుతాయి, అది ఎవరికి లాభమో ఎవరికి వారు బేరీజు వేసుకుంటున్నారు కానీ వాస్తవం ఇంకా తెలియదంటూ చెప్పారు.





























