Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా వివేకానంద హత్య కేసులో ఏ2 గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి పరారీ లో ఉన్నట్లుగా వార్తలు వినిపించగా తాజాగా ఆయన రేపు నాంపల్లి కోర్ట్ లో లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. అసలు బెయిల్ గడువు ముగిసి పరారిలో ఉన్న ఎర్ర గంగిరెడ్డి కోర్ట్ కి లొంగిపోడానికి కారణం ఏమిటి, ఎవరు చెబితే లొంగిపోతున్నాడు వంటి విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.

లాయర్ సలహాతో లొంగిపోనున్న ఎర్ర గంగిరెడ్డి…
వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి వాంగ్మూలం కీలకంగా సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. అందులో భాగంగానే దస్తగిరి చెప్పిన వారిలో ఎర్ర గంగిరెడ్డి ఉండటం వలన అతడిని సిబిఐ అరెస్టు చేయగా బెయిల్ మీద బయట ఉండగా తాజాగా బెయిల్ గడువు ముగిసింది. ఇక అజ్ఞాతంలో ఉంటూ ఉన్న ఎర్ర గంగిరెడ్డి కోర్ట్ లో లొంగిపోమన్ని ఆయన లాయర్ సలహా ఇచ్చారట. లొంగిపోకుండా ఉంటే సిబిఐ మరో కేసు పెట్టి ఇబ్బంది పెడుతుంది.

అనవసరమైన సమస్యలు తెచ్చుకోవడం కంటే లొంగిపోవడం ఉత్తమం అని, ఒకవేళ కోర్ట్ లో ట్రైయిల్ జరగక పోతే బెయిల్ మళ్ళి వస్తుంది అని కన్విన్స్ చేసి లొంగిపోయేలా చేశారట. నాంపల్లి కోర్ట్ లో త్వరలో హాజరువ్వబోతున్నారు. అయితే మొదటి నుండి కేసులో దస్తగిరి చెబుతున్న కథనే సిబిఐ కూడా ఫాలో అవుతోందంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. లేదంటే సిబిఐ దస్తగిరిని వాడుకుంటూ ఈ కథ అల్లి అది ప్రచారం చేయమని చెప్పుండొచ్చు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.


































