Analyst Damu Balaji : తెలంగాణ ఎన్నికలు ముగిసాయి… గెలుస్తామన్న ధీమాతో ముందస్తుకు వెళ్లిన కెసిఆర్ తెలంగాణ ప్రజల ఆలోచనలను అంచనా వేయడంలో విఫలమయ్యారు. తెలంగాణ ఏర్పడిన పదేళ్లకు ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాగా సీఎం రేస్ లో అందరి నోటా వినిపిస్తున్న పేరు రేవంత్ రెడ్డి. నిజానికి ఎన్నికలకు మూడు నెల్లముందు కూడా బిఆర్ఎస్, రెండో స్థానంలో బీజేపీ ఉండగా మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఏకంగా గెలవడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి. ఒంటి చేత్తో కాంగ్రెస్ ను గెలిపించిన రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కాబోతున్న తరుణం ఆయన జీవితం, సీఎంగా ఆయన ఎదిగిన తీరు అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

విద్యార్ధి రాజకీయాల నుండి నేడు సీఎం పదవి వరకు…
1969 లో మహబూబ్ నగర్ కొండారెడ్డి గ్రామంలో జన్మించిన అనుముల రేవంత్ రెడ్డి గారు విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఏబివిపి విద్యార్థి సంఘంలో ఉన్న ఆయన ఆర్ఎస్ఎస్ లో కూడా ఉన్నారు. అయితే చదువుయ్యాక అందరూ బీజేపీ పార్టీ వైపు వెళ్తారనుకుంటే ఎన్టీఆర్ మీద అభిమానము, అలాగే చంద్రబాబు మీద అభిమానంతో 2005లో ఆయన టీడీపీ పార్టీలోకి చేరి అధిష్టానం వద్దని చెప్పినా మేడ్చల్ మండలం జెడ్పిటిసి మెంబెర్ గా గెలిచారు. ఆపైన 2009 ఎమ్మెల్సిగా గెలుపొందిన ఆయన టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు కి ప్రియ శిష్యుడిగా మారాడు. కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తెలంగాణ విడిపోయాక 2017లో కాంగ్రెస్ చేరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ముగ్గురిలో ఒక్కడిగా ఎన్నికయ్యడు.

2018 లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆయన మల్కాజిగిరి నుండి ఎంపి గా గెలిచారు. ఇక తాజాగా తెలంగాణ ఎన్నికలలో ఆయన గెలవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితం గురించి బాలాజీ మాట్లాడుతూ ఆయన ఇంటర్ చదివే సమయంలోనే గీత అనే అమ్మాయిని ప్రేమించగా ఆమె కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైపాల్ రెడ్డి గారి తమ్ముడి కూతురు కాగా డిగ్రీ చదివే సమయంలో వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసి గీతను ఢిల్లీలో చదివించారు. అయితే రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా జైపాల్ రెడ్డి గారి వద్దకే వెళ్లి తమ ప్రేమ వ్యవహారం చెప్పడంతో ఆయన ముక్కుసూటి తనం, ధైర్యం నచ్చి రాజకీయాల్లో ఖచ్చితంగా రానిస్తాడనే నమ్మకం కలిగి తమ్ముడికి చెప్పి పెళ్లి చేసారు. అలా రేవంత్ రెడ్డి గారు కష్టపడి తన లవ్ లైఫ్ అలాగే పొలిటికల్ లైఫ్ లోనూ సక్సెస్ అయ్యారు. ఇక ఆయన ఓటుకు నోటు కేసు సమయములో చంద్రబాబు పేరు చెబితే ఆయన సేఫ్ అవుతాడని తెలిసినా నిబద్దతతో వ్యవహరించి చంద్రబాబు ప్రియ శిష్యుడిగా మరోసారి రుజువు చేసుకున్నాడు. నిజానికి ఓటుకి నోటు కేసు ద్వారానే రేవంత్ కి మరింత ప్రాచుర్యం లభించింది అనడంలో సందేహం లేదు. తెలంగాణ రాజకీయనాయకులలో కెసిఆర్ ను ధైర్యంగా తన మాటలతో ఢీ కొట్టగల నాయకుడు రేవంత్ మాత్రమే. ఇక ఆయన స్పీచ్ లతో తెలంగాణ సమాజంలో రేవంత్ రెడ్డి కాస్తా రేవంతన్నగా ఆదరణ చూరగున్నారు అంటూ బాలాజీ రేవంత్ రెడ్డి గారి జీవితం గురించి వివరించారు.





























