Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి మరణించి నాలుగేళ్లు కావొస్తున్నా చంపింది ఎవరనే విషయాలు స్పష్టంగా ఇప్పటికీ తెలియరాలేదు. ఏపీ సీఎంకి సొంత బాబాయ్ అయినా ఎవరు చంపారో ఇప్పటికీ తెలయక పోవడం పట్ల అటు విపక్షాల నుండి గట్టి విమర్శిలే ఎదుర్కొంటున్న జగన్, ఇంట్లోనే హంతకులున్నారనే కథనాలు వినిపిస్తున్న విమర్శకు కౌంటర్లు వేస్తున్నారే కానీ కేసులో మాత్రం పురోగతి లేదు. రోజుకో పేరు బయటికి వస్తోంది, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అంటూ వార్తలు వినిపించినా అవేవి జరగలేదు. అయితే తాజాగా అవినాష్ రెడ్డిని విచారించడానికి సిబిఐ మరోసారి పిలవడం, అవినాష్ రాలేనని చెప్పడం, అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి గుండెపోటుతో హాస్పిటల్ లో చేరడంతో ఆయన గడువు కోరడం వంటి ఆసక్తికర సంఘటనల నడుమ తాజాగా కోర్ట్ లో అవినాష్ తరుపు లాయర్ సుమారు ఐదు గంటల పాటు వాదనలు వినిపించారు. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

కోర్ట్ తీర్పు రిజర్వు చేయడం వెనుక కుట్ర…
దాము బాలాజీ మాట్లాడుతూ కోర్ట్ గురించి న్యాయమూర్తుల గురించి మీడియాలో డిబేట్స్ పెట్టడం వల్ల న్యాయ స్థానాల మీద సాధారణ జనాలకు నమ్మకం పోయే ప్రమాదం ఉందని తెలిపారు. వివేకానంద హత్య కేసులో అవి జరుపుతున్న విచారణ గురించి కోర్ట్ పనితీరు గురించి కొన్ని మీడియా సంస్థలు పెడుతున్న డిబేట్స్ లో న్యాయ మూర్తులు అమ్ముడుపోతున్నారు అన్నట్లుగా వాఖ్యణించడం, కేసులో తెర్పులను వాళ్ళే చెప్పడం చేస్తున్నారు అంటూ బాలాజీ తెలిపారు.

వివేకానంద హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై హై కోర్ట్ లో సుధీర్ఘ వాదనలు జరుగగా కోర్ట్ తీర్పును 31 వ తేదికి రిజర్వు చేసింది. అందుకు పలు కారణాలు పేర్కొన్నప్పటికీ వైసీపీ వ్యతిరేక ఛానెల్స్ పనిగట్టుకుని జడ్జి అమ్ముడు పోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక ఛానెల్ లో సస్పెండెడ్ జడ్జి రామకృష్ణ అనే ఆయన జడ్జి తీర్పు రిజర్వు చేసాడంటే మూటలు అందుంటాయి అంటూ మాట్లాడారని, అలా కామెంట్స్ చేయడం వల్ల న్యాయస్థానాల మీద నమ్మకం పోతుందని తెలిపారు.





























