Analyst Damu Balaji : పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం మీద విమర్శను చేస్తూ తాజాగా ఏపీలో మహిళల అక్రమ రవాణా గురించి మాట్లాడారు. ఏపీలో దాదాపుగా 30వేల మంది మహిళలు మిస్ అయ్యారని అందులో 14 వేల మంది తిరిగి రాగా ఇంకా మిగిలిన వాళ్ళ గురించి ఏ విషయం తెలియదని, ఇది కేంద్ర నిఘా సంస్థ చెప్తున్న లెక్కలు నేను కల్పించి చెబుతున్నవి కాదు అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక ఈ మహిళా అక్రమ రవాణాకు వాలంటీర్లు తీసుకుంటున్న వ్యక్తిగత డేటా ఉపయోగపడుతోందని అనడం వివాదాస్పదమైంది. ఇక ఈ విషయాల మీద టీడీపీ అనుకూల మీడియా అయిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ తన కొత్త పలుకులో మాట్లాడారు. ఆ విశేషాలను అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.

వాలంటీర్ల ద్వారా వైసీపీ గేమ్ ఆడుతోందా…
పవన్ చేసిన వాఖ్యలను ఆర్కే సమర్తించలేదు. వాలంటీర్ల వల్లే అక్రమ రవాణా అని చెప్పకపోయినా వాలంటీర్ల వల్ల జగన్ ఒక్కో నియోజకవర్గం నుండి డేటా సేకరిస్తున్నాడు. స్థానిక ఎమ్మెల్యే తో పనిలేకుండా జగన్ వాలంటీర్ల డేటా ద్వారా ఓట్లను తొలగించడం వంటివి చేస్తున్నారని కామెంట్స్ చేసారు. వాలంటీర్లు ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటూ వైసీపీ పార్టీ కోసం పనిచేస్తున్నారని మాట్లాడారు. ఇక ఈ విషయం గురించి బాలాజీ మాట్లాడుతూ వాలంటీర్లు వ్యక్తిగత డేటాను సేకరించి ప్రభుత్వానికి ఇస్తున్నానరని అభియోగం తప్పు, నిరాధారమైంది.

ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చాక డేటా సేకరిస్తారు. పథకాలు ఇవ్వాలంటే డేటా ఇవ్వాల్సిందే. ఇక్కడ వ్యక్తిగత డేటా అంటే కేవలం ఆధార్ కార్డు, పాన్ నెంబర్ ఇంట్లో ఉన్న సభ్యుల సంఖ్య వంటివి తీసుకుంటారు. దాని వల్ల వస్తోన్నా నష్టం ఏమిటి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారు అంటూ చెప్పడం కూడా నిరాధారమైనది. ఒకవేళ అలాంటి అనుమానం ఉంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలి అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.



































