బుల్లి తెరపై జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలతో భారీ క్రేజ్ సంపాదించినా భామ యాంకర్ రష్మీ గౌతమ్.. హాట్ యాంకర్ జబర్దస్త్ షోతో హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కెరియర్ మొదట్లో సినిమాల్లో ట్రై చేసినా ఆతరువాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో టీవీ షోలకే పరిమితమైంది ఈ హాట్ యాంకర్. మంచి ఫామ్ లో ఉన్న సమయంలో అనసూయ జబర్దస్త్ కు బ్రేక్ ఇవ్వడంతో ఆ గ్యాప్ లో జబర్దస్త్ లో సెటిల్ అయిపోయింది ఈ ముద్దగుమ్మ. అయితే ఆ తరువాత అనసూయ తిరిగి రావడంతో జబర్దస్త్ ను రెండు పార్ట్ లు చేసారు. జబర్డస్ట్ కు అనసూయ యాంకర్ అయితే.. ఎక్స్ట్రా జబర్దస్త్ కు వన్ అండ్ ఓన్లీ యాంకర్ రష్మీ. తనకు వచ్చిరాని తెలుగుతో తెలుగు ప్రేక్షకులను బాగానే మెప్పిస్తోంది. అయితే కమిడియన్ సుడిగాలి సుధీర్, రష్మిల మధ్య ఎదో నడుస్తోందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే వీరిద్దరూ కూడా ఈ రూమర్స్ తోనే ఫ్యామస్ అయ్యారు. సుధీర్, తనకు మధ్యలో ఏమిలేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ.

అయితే తాజగా తనకు వెండితెరపై ఒక హీరో అంటే పిచ్చి అని, అతడితో డేటింగ్ చేయాలని ఎప్పటినుంచొ ఒక కోరిక ఉందని తన మనసులో మాట చెప్పింది. వెండితెరపై ఇప్పుడు ఉన్న యుంగ్ హీరోలలో తనకు యుంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. తారక్ డాన్స్ అంటే పిచ్చి ఆని, ఒక్క చాన్స్ ఇస్తే తారక్ తో డాన్స్ చేయాలనీ ఉందని చెప్పింది. అంతేకాదు తారక్ కు ఇప్పటికే పెళ్లి అయిపోయిందని, సో తనకు డేటింగ్ చేసే ఛాన్స్ లేదని తెలిపింది. కానీ యుంగ్ టైగర్ పిలిస్తే మాత్రం వేరే ఆలోచన లేకుండా వెళ్లిపోతానని తన మనసులోని మాట చెప్పింది రష్మీ గౌతమ్. మరోవైపు రష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది.. అంతేకాదు సోషల్ రెస్పాన్సిబిలిటీ లో ఎప్పుడు ముందుంటుంది. తాజాగా లాక్ డౌన్ సమయంలో మూగజీవాల ఆకలి తీరుస్తూ అందరితో శెభాష్ అనిపించుకుంటుంది.































