Anchor Vishnu Priya : తెలుగు తెర మీద యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న విష్షు ప్రియ ఈటీవీలో పోవే పోరా షో తో బాగా ఫేమస్ అయింది. ఒక వైపు యాంకరింగ్ చెస్తున్నా మరో వైపు సోషల్ మీడియాలో డాన్స్ వీడియోస్ తన వ్యక్తిగత విషయాలను పెడుతూ మరింత ఫేమస్ అయింది. ఇక ఈటీవీలో పలు షోస్ చేస్తూ అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ వచ్చిన విష్ణు ప్రియా ప్రస్తుతం సోషల్ మీడియకు దూరమైంది.

తల్లి మరణంతో క్రుంగిపోయిన విష్ణు ప్రియ….
ఎంతో చలాకిగా అల్లరి చేస్తూ కనిపించే విష్ణు ప్రియా ఈ మధ్యనే సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది. అయితే తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకునే విష్ణు ప్రస్తుతం సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. దీనికి కారణం తన తల్లి ఆకస్మిక మరణమే. విష్ణు ప్రియ తల్లి జనవరి 26 న మరణించారు.

తన చెల్లి,అమ్మతో కలిసి ఉంటున్న విష్షు ప్రియ సడెన్ గా తల్లి మరణించడంతో ఆ బాధను తట్టుకోలేక పోయింది . ఇక తాజాగా తల్లి పుట్టినరోజు కావడంతో ఎమోషనల్ పోస్ట్ తో విష్ణు ప్రియ మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చింది. చాలా మిస్ అవుతున్న అమ్మ లవ్ యు అంటూ పోస్ట్ పెట్టింది . దీంతో నేటిజన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు స్టే స్ట్రాంగ్ అంటూ విష్ణు కి ధైర్యం చెబుతున్నారు.































