Connect with us

Featured

యాంకర్ గా వచ్చి.. హీరోయిన్ గా పాతుకుపోయిన యాక్టర్స్ వీళ్ళే..!

Published

on

సినిమా రంగంలో రాణించాలని చాలామంది కలలు కంటుంటారు. హీరోయిన్‌ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు చాలా మందే ఉన్నారు. దాని కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ హీరోయిన్లు కాలేరు.. హీరోయిన్స్ కావాలంటే అందం, అభినయంతో పాటూ అదృష్టం కూడా ఉండాలి.

కొంత మంది పెద్దగా ప్రయత్నం చేయకుండానే స్టార్‌ హీరోయిన్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక ఇండస్ట్రీలోకి బుల్లితెర యాంకర్‌గా అడుగుపెట్టి ఆ పై వచ్చిన క్రేజ్ తో హీరోయిన్లుగా ఎదిగిన కొంతమంది తారల గురించి తెలుసుకుందాం.

ముందుగా మెగా డాటర్‌ నిహారిక గురించి తెలుసుకుందాం.. ఇండస్ట్రీకి యాంకర్‌గా వచ్చి ఆ తర్వాత హీరోయిన్‌గా మారిపోయింది మెగాడాటర్. ఓ డ్యాన్స్‌ షోకి బుల్లి తెరపై యాంకర్‌గా పనిచేసింది. అయితే అక్కడ ఆమె యాంకరింగ్‌ తో అందరినీ ఆకట్టుకుంది. ఆ తరువాత ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్‌గా మారిపోయింది.

హీరోయిన్‌ రెజీనా కస్సాండ్రా.. ఈ ముద్దుగుమ్మ కూడా ఒకప్పుడు బుల్లి తెర యాంకర్. అయితే ఆ విషయం చాలా మందికి తెలియదు. మొదట్లో హీరోయిన్ రేజీనా ఓ చానల్‌లో క్విజ్‌ ప్రోగ్రామ్‌కి యాంకర్‌గా పనిచేంది. ‘కందనాల్‌ ముదల్‌(2005)’ చిత్రంతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది రేజీనా. అప్పటికి ఆమె వయస్సు 16 ఏళ్ల మాత్రమె. ఇక తెలుగులో 2012 లో సుదీర్ బాబు హీరోగా వచ్చిన ‘శివ మనసులో శృతి (SMS)’ చిత్రంలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కలర్స్‌ స్వాతి… అతి చిన్న వయసులో ఒక ప్రముఖ టీవీ చానల్ లో ‘కలర్స్’ అనే ప్రోగ్రామ్ కి యాంకర్ గా పనిచేసింది. ఆ ప్రోగ్రాంతో తెలుగునాట సూపర్ పాపులర్ అయింది. అప్పటినుంచే ఆమె పేరు ముందు ‘కలర్స్’ నిలిచిపోయింది. ఇక యాంకర్ తరువాత సినిమా రంగంలో అనేక పాత్రలు పోషించింది. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది. ఆ తరువాత 2008లో ‘అష్టా చెమ్మా’ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2008 లో ఈ సినిమాకు గాను ఆమెకు నంది పురస్కారం కూడా లభించింది.

అనసూయ భరద్వాజ్‌.. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ యాంకర్‌గా ఎవరు అంటే మొదటగా వచ్చేది కనకాల సుమ పేరు. ఆమె తరువాత చెప్పాలంటే ఖచ్చితంగా అనసూయనే. ఇక అనసూయ టాలీవుడ్ లోకి ఎన్టీఆర్‌ నటించిన ‘నాగ’ చిత్రం ద్వారా అడుగుపెట్టింది. అయితే ఒక ప్రముఖ చానెల్ లో కామెడీ షో ద్వారా యాంకర్ గా ప్రవేశించింది. ఇక అప్పటి నుంచి నేటి వరకు ఒక వైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో ప్రత్యెక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ హాట్‌ యాంకరమ్మ. అనసూయ ‘క్షణం’, ‘రంగస్థలం’లో ఆమె చేసిన పాత్రలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘కథనం’ సినిమాతో హీరోయిన్‌గా మారిపోయింది.

శ్రీముఖి.. ఈమె యాంకర్ గా కెరీర్ ప్రారంభించి.. ఇప్పటికి యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. మధ్యమధ్యలో కొన్ని సినిమాల్లో నటిస్తూ వస్తుంది. 2015 లో ‘చంద్రిక’ సినిమా తో శ్రీముఖి హీరోయిన్ అవతారం ఎత్తింది.

రష్మి గౌతమ్‌.. ఇక ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై రాణిస్తున్న టాప్‌ యాంకర్లలో రష్మి గౌతమ్ కూడా ఒకరు. 2007లోనే యాంకరింగ్ రంగంలోకి అడుగులువేసిన ఈ హార బ్యూటీ ప్రస్తుతం యాంకర్ గా కొనసాగుతూనే అడపాదడపా సినిమాల్లో హీరోయిన్‌గా రాణిస్తోంది. ‘గుంటూరు టాకీస్’ సినిమా తో రష్మీ హీరోయిన్ గా పరిచయం అయింది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Ramcharan: రామ్ చరణ్ ఆ ఇంట్రడక్షన్ సీన్ నిజం కాదా… ఇంత పెద్ద మోసం చేశారా?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినటువంటి చరణ్ తండ్రికి మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.

ఇక రాంచరణ్ సినిమాలలో రంగస్థలం సినిమా కూడా ఓ మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈయన నటన అద్భుతం అని చెప్పాలి సుకుమార్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక సాధారణ వ్యక్తి లాగా సైకిల్ తొక్కుతూ ఎంట్రీ ఇచ్చారు ఈ విషయం గురించి సుకుమార్ గారికి ఒక ప్రశ్న ఎదురైంది.

ఇలా ఒక స్టార్ హీరోని ఇంత సింపుల్గా చూపించడంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం మీలో కలగలేదా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ..కథకి అనుగుణంగా ఒక వ్యక్తి ఏదో వెతుక్కుంటూ వెళతాడు. ఆ రోజుల్లో వాహనం అంటే సైకిల్.. అందుకే సైకిల్ లో చూపించా.లాంగ్ షాట్ లో వంతెనపై సైకిల్ తొక్కుతూ కనిపించాలి. ఆ తర్వాత టాప్ యాంగిల్ లో చూపిస్తూ నెమ్మదిగా రాంచరణ్ ముఖం దగ్గరికి కెమెరా రావాలి. కాబట్టి ఫ్లైయింగ్ కెమెరా వాడాం.

Advertisement

నాలుగైదు టేకులు..
నాలుగైదు టేకులు చేసిన మంచిగా రాకపోవడంతో ఇక ఈ ఇంట్రడక్షన్ సీన్ సీజీ వర్క్ లో పూర్తి చేశాం అని సుకుమార్ చెప్పారు. అవునా అది సీజీ షాటా అని ఆశ్చర్యపోయారు. రాంచరణ్ సైకిల్ తొక్కుతున్నది మాత్రం రిఫరెన్స్ గా తీసుకుని ఆ సీన్ ని సీజీ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారు. సినిమాలో ఇంకా కొన్ని సీజీ షాట్స్ ఉన్నాయి. కానీ ఎవరూ గుర్తు పట్టలేరు అని సుకుమార్ నవ్వేశారు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Venu: బాహుబలి సినిమా చేస్తున్నావా.. వేణు ఇన్ని అవమానాలు పడ్డారా?

Published

on

Venu: జబర్దస్త్ కమెడియన్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈయన బలగం అనే సినిమా ద్వారా దర్శకుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకున్నాయి అంటే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో స్పష్టంగా తెలుస్తుంది. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు తదుపరి సినిమా నానితో చేసే అవకాశాన్ని అందుకున్నారు త్వరలోనే వీరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించిన విషయాలు తెలియచేయబోతున్నారు.

ఇలా దర్శకుడిగా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు మరొక కమెడియన్ ధనరాజ్ తో కలిపి ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది ఈ ప్రోమోలో భాగంగా బలగమా సినిమా గురించి ప్రశ్నలు వేశారు.

Advertisement

ఈ సందర్భంగా వేణు సమాధానం చెబుతూ తాను బలగం సినిమా షూటింగ్ సమయంలో కొంతమంది టెక్నీషియన్ లతో మాట్లాడుతూ ఉండగా కొందరు నన్ను అవమానపరిచారని తెలిపారు. ఏదో పెద్ద బాహుబలి సినిమా చేస్తున్నావా ఏంటి అంటూ అవమానించారని వేణు తెలిపారు.

చిన్న సినిమాలలో బాహుబలి..
ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మీరు ఈ సినిమాపై స్పందిస్తూ చిన్న సినిమాలలో బాహుబలి అంటూ కామెంట్స్ చేయడం తను ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అంటూ ఈ సందర్భంగా వేణు చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!