Connect with us

Featured

బాలీవుడ్ హీరో సుశాంత్ కేసులోని సిద్ధార్థ్ పితానీ ఎవరు.? ఈ తెలుగబ్బాయికి సుశాంత్ కేసుకి సంబంధం ఏంటి?

Published

on

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకొస్తూ క్రొత్త మలుపులు తిరుగుతుంది. ఇన్ని రోజులు సుశాంత్ బలవాన్మరణం పొందాడనుకుంటున్న కేసును ఇప్పుడు పాట్నా పోలీసులు దర్యాప్తు చేస్తుండటంతో జరుగుతున్న పరిణామాలను, నడుస్తున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే సుశాంత్ ఉరి వేసుకునెంత పిరికి వాడు కాదని తాజాగా సుశాంత్ ఫ్యామిలీ ఫ్రెండ్ స్మితా పారిఖ్ సంచలన కామెంట్స్ చేశారు.

సుశాంత్ ది బలవాన్మరణం కాదని తాము ముందు రోజు నుంచి చెబుతున్నామని, సుశాంత్ కుటుంబ సభ్యులదీ ఇదే అభిప్రాయమని, సుశాంత్ బలవన్మరణం పొందినట్టు చెబుతున్న వస్త్రానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు ఇప్పటికీ బయటికి రాలేదని, ఈ సంఘటన జరిగిన జూన్ 14న పితానీ, శామ్యూల్ అనే ఇద్దరు వ్యక్తులే అక్కడ ఉన్నారని, వీరిద్దరూ సుశాంత్ సాంకేతిక వ్యవహారాలను చూస్తుంటారని ఈ సందర్భంగా పారిఖ్ తెలియజేశారు. మరోవైపు సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తుంది. సుశాంత్ వద్ద జీరో బ్యాలన్స్ ఉన్నా.. అతడి దగ్గర్నుంచి 50 కోట్లు కాదు కదా 100 కోట్లు తీసుకుపోయినా కూడా అతను ప్రాణం తీసుకునేంత చేసుకునేంత పిరికివాడు కాదని.. మళ్లీ ఆ డబ్బును సంపాదించే తెలివి, ధైర్యం 2 ఉన్నవాడంటూ అంకిత చెప్పుకొచ్చింది. సినీ ఫక్కీలో రోజుకో క్రొత్త మలుపు తిరుగుతున్న ఈ కేసులో ఇప్పుడు అందరి దృష్టి ఓ వ్యక్తి పైనే వుంది.

అతడే సిద్ధార్థ్ పితానీ. తెలుగబ్బాయే. సినిమా రంగంపై ఇంట్రస్ట్ తో జైపూర్‌లో పని చేస్తున్న సిద్ధార్థ్‌.. 2019లో సుశాంత్‌ కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత సుశాంత్ సింగ్‌ కు రూమ్ మేట్ గా మారిన సిద్ధార్థ్.. సుశాంత్ చనిపోయిన రోజు అతడి ఫ్లాట్‌లోనే వుండటంతో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అతడి పేరే ఎక్కువగా వినబడుతుంది. సుశాంత్ బలవాన్మరణం పొందిన టైంలో తలుపులు తెరుచుకోవడం లేదంటూ సుశాంత్ సింగ్ అక్కకు ఫోన్ చేసి తలుపులు తెరిపించింది కూడా సిద్ధార్థ్ పితానీయే కావడం విశేషం. అయితే సోషల్ మీడియాలో మాత్రం రియా, సుశాంత్ మధ్య అసలేం జరిగింది.? వాళ్లిద్దరూ ఎప్పట్నుంచి కలిసుంటున్నారు.? మొదలైన విషయాలన్నీ సిద్ధార్థ్‌కు బాగా తెలుసనే రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ సిద్ధార్థ్ మాత్రం ఎంత సుశాంత్‌ తో కలిసి ఒకే ఇంట్లోనే ఉన్నా కూడా అసలేం జరిగిందో తనకు తెలియదంటూ చెప్తున్నాడు. కానీ అతని మాటలను ఎవరూ అంత ఈజీగా నమ్మడం లేదు. ఈ కేసులో ఎవరూ ఊహించని మరో ట్విస్ట్ ఏమిటంటే.. తనను రియాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని సుశాంత్ ఫ్యామిలీ మెంబర్స్ బెదిరిస్తున్నారని సిద్ధార్థ్ పితానీ ముంబై పోలీసులకు ఈమధ్యనే మెయిల్ షేర్ చేసాడు. దీంతో సుశాంత్ కేసు చాలా మలుపులు తిరిగేలా కనబడుతుంది. సిద్ధార్థ్ పితానీ పేరు కూడా సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది. మొత్తానికి సుశాంత్ కేసులో అసలేం జరిగింది.? అనే అంశంపై సిద్ధార్థ్ నోరు విప్పితే కానీ అసలు నిజాలు బయటికి రావంటున్నారు బీహార్ పోలీసులు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Venu Swamy: ఆవిడ నన్ను ప్రేమించింది.. నేను ప్రేమించాల్సి వచ్చింది: వేణు స్వామి రియల్

Published

on

Venu Swamy: వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు. ఈయన ప్రముఖ జ్యోతిష్యులుగా ఎంతోమంది సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచు వార్తల్లో నిలిచారు. కేవలం రాజకీయాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి ఈయన పెద్ద ఎత్తున అభిమానుల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు.

ఇకపోతే ఇటీవల కాలంలో వేణు స్వామి తన భార్య వీణా వాణితో కలిసి రీల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజుల క్రితం ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాలోని డైలాగుకు రీల్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే తాజాగా మరొకరి వీడియో ద్వారా ఈయన అభిమానుల ముందుకు వచ్చారు.

ఈ క్రమంలోనే నాగార్జున సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా నటించిన మన్మధుడు సినిమాలోని ఒక సీన్ రీ క్రియేట్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున సోనాలి బింద్రే ఇద్దరు ప్యారిస్ వెళ్లగా అక్కడ బ్రహ్మానందంతో ఓ సన్నివేశం వస్తుంది. మీ ఇద్దరిదీ లవ్ మ్యారేజ్ అంటూ నాగార్జున బ్రహ్మానందం ని అడగడంతో అందుకు ఆయన చెబుతూ మొదట ఆమె నన్ను ప్రేమించింది తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అనే డైలాగును వేణు స్వామి కూడా రీ క్రియేట్ చేశారు.

Advertisement

ఊపిరి పీల్చుకో..

ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది వామ్మో వేణు స్వామిలో ఈ యాంగిల్ కూడా ఉందా సోషల్ మీడియా ఇక ఊపిరి పీల్చుకో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా జ్యోతిష్యం చెబుతూనే వార్తలలో నిలిచినటువంటి ఈయన ఇప్పుడు మాత్రం రీల్స్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారని చెప్పాలి.

https://www.instagram.com/reel/C5oDUlhxisr/?utm_source=ig_embed&ig_rid=c69f6a00-74ea-461b-b532-7e7a5316f48a

Advertisement

Continue Reading

Featured

Rashmika: నాకంటే అందగత్తెలు ఉన్నారు.. రష్మిక కామెంట్స్ వైరల్!

Published

on

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా స్టార్ డం గురించి ఈమె మాట్లాడారు.

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్నారు అయితే నాకంటే ఎంతో అందమైన అమ్మాయిలు ఉన్నారు అలాగే బాగా నటించగలిగే వారు ఉన్నారు వారందరూ అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారని తెలిపారు.

ఇలా నేను ఇక్కడ వాళ్లు అక్కడ ఉండటానికి కారణం అదృష్టం మాత్రమేనని ఈమె తెలిపారు. నాకు అదృష్టం రావడంతో ఇక్కడికి వచ్చానని ఈమె తెలియజేశారు. ఇలా వచ్చిన అదృష్టాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకొని నన్ను నేను నిరూపించుకోవడం కోసం ప్రయత్నాలు చేశానని రష్మిక తెలిపారు.

Advertisement

పతనానికి కారణం..
సినిమా ఇండస్ట్రీలో అని మాత్రమే కాదు ఏ రంగంలో అయినా కూడా జయాలు అపజయాలు అనేది సర్వసాధారణంగా ఉంటాయి అయితే మనం విజయం సాధించినప్పుడు ఆ పొగరు తలకెక్కించుకోకూడదు అలా ఎక్కించుకున్నాము అంటే ఆ ప్రభావం మన మనసుపై పడుతుందని అది పతనానికి కారణం అవుతుంది అంటూ రష్మిక ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ramcharan: డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్.. ఇది వారందరికీ దక్కిన గౌరవం అంటూ?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఇటీవల చెన్నై వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఇండస్ట్రీకి అందించినటువంటి సేవలను గుర్తించినటువంటి వేల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రం జరిగినటువంటి యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమాలలో భాగంగా రామ్ చరణ్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన డాక్టరేట్ అందుకోవడంతో రామ్ చరణ్ కాస్త ఇకపై డాక్టర్ రామ్ చరణ్ గా మారిపోయారని చెప్పాలి. ఇక ఈయనకు డాక్టర్ అందించడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా డాక్టరేట్ అందుకున్నటువంటి రామ్ చరణ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చెన్నైలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేల్స్ యూనివర్సిటీ నుంచి నాకు ఈ గౌరవం దక్కడం నిజంగా సంతోషంగా అనిపిస్తుందని ఈయన వెల్లడించారు. ఆర్మీ లాంటి గ్రాడ్యుయేషన్ మధ్యలో నేను ఇలా ఈరోజు ఉండటం  ఊహిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

Advertisement

అందరి గౌరవం ఇదీ…
ఈరోజు ఇలా డాక్టరేట్ అందుకున్నాను అంటే అది కేవలం నాకు దగ్గర గౌరవం మాత్రమే కాదని తెలిపారు నన్ను ఆదరించిన అభిమానులది నన్ను నమ్మి సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలది అంటూ రాంచరణ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ యూనివర్సిటీని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి ఇక్కడ నిర్వాహకులకు అధ్యాపకులకు అలాగే విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!