ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే పదవ తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుంది. కానీ ఇప్పటినుంచి ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే ఇంటర్మీడియట్ విద్యార్హత తప్పనిసరి చేస్తూ ఒక కీలక ప్రకటన చేసింది జగన్ సర్కార్. గత కొన్ని కొన్నేళ్లుగా కొనసాగుతున్న పదవతరగతి విద్యార్హతను ఇప్పుడు మారుస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. త్వరలో దీనిపై పూర్తీ వివరాలు వెల్లడించనుంది.

ఇదే క్రమంలో ఈ విద్యా సంవత్సరం ఎకాడమిక్ కాలెండర్ ను మారుస్తూ మరో నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇప్పటివరకు జూన్ 12 నుంచి ఏప్రిల్ 23 వరకు ఉన్న విద్యా సంవత్సరాన్ని కరోనా మహమ్మారి కారణంగా ఈ ఆగస్టు నుంచి వచ్చే ఏడాది జులై, 2021 వరకు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు పదవ తరగతి పరీక్షలపైనా కూడా కసరత్తులు చేస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత మరో రెండు వారాలకు పదవ తరగతి పరీక్షలు నిర్వచించాలని భావిస్తున్నారు. దీనిపై ఇంకా నిర్ణయానికి రావాల్సి ఉంది.
































