ఇవాళ ఏపీ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. నూతన సీడ్ పాలసీ, నేతన్న నేస్తం అమలు, అండ్ బి శాఖ ఆస్తులను ఆర్డీసీకి బదలాయింపు,నాడు-నేడు రెండో దశ పనులపై భేటీలో చర్చించనున్నారు.

అలాగే పోలవరం ముంపు బాధితులకు గతంలో తక్కువ నష్ట పరిహారం అందుకున్న వారికి తిరిగి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు అదనంగా ఇవ్వాలన్నా అంగీకారంపై కేబినెట్ అమోదం తెలపనుంది. ఆక్వా రైతులకు లాభం కలిగించేలా ఫిష్ మార్కెటింగ్ పాలసీ రూపకల్పన చేయనుంది. ఇండస్ట్రీ పాలీసీపై కూడా మంత్రి మండలి చర్చించనుంది.





























