ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన నిన్న ఖరారైనా విషయం తెలిసిందే.. ఈ క్రమంలో గురువారం ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్తున్నారు. ఉదయం 10 గంటల సమయంలో ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.

హోంమంత్రి అమిత్ షా తో భేటీ కానున్నట్టు తెలుస్తుంది. ఆ తరువాత జల వనరుల శాఖమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, రైల్వే శాఖ మంత్రి గోయల్ సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలవనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ బకాయిల విడుదలపై జలశక్తి మంత్రితో జగన్ చర్చించనున్నారు. దీనితో పాటూ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చిస్తారు.





























