జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ నేపథ్యంలో ఎటు కదలలేని పరిస్థితిలో ఉన్న ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సివస్తే ఓలా క్యాబ్స్ ఉపయోగిచుకోవడానికి అవకాశం కల్పించింది. ఇది కేవలం అత్యవసర వైద్య సేవలు కావాల్సిన వారికి మాత్రమే అని స్పష్టం చేసింది. ఏపీలో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఓలా ముందుకు వచ్చింది. డయాలసిస్, గుండెజబ్బులు, క్యాన్సర్ తదితర రోగులకు ఓలా సేవలు ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నారు.

మొదటిదశలో విశాఖపట్నం లో ఈ సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఇక్కడ మంచి ఫలితాల్ని ఇస్తే మిగిలిన నగరాలకు కూడా ఈ సేవలను విస్తరించనున్నారు. అయితే కరోనా లక్షణాలు లేని వారికీ మాత్రమే ఈ సేవలు వినియోగించుకోవడానికి అనుమతిస్తారు. ఆసుపత్రి నుంచి ఇంటికి, ఇంటినుంచి ఆసుపత్రికి మాత్రమే ఈ సేవలను అందిస్తారు. ఒక క్యాబ్ డ్రైవర్ తో పాటుగా మరో ఇద్దరికీ మాత్రమే క్యాబులో చోటు ఉంటుంది. డాక్టర్ లు, మెడికల్ సిబ్బంది కూడా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. కారులో కూర్చున్న వరకు ఖచ్చితంగా దూరం పాటించాల్సిందే. నిబంధనలు పాటించకపోతే తగిన చర్యలు తీసుకుంటారు. అయితే, కర్ణాటకలో ఇటువంటి సెలవలు ఇప్పటికే అమలులో ఉన్నాయి.




























