APSRTC : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, బస్సుల సౌలభ్యంపై నేడు సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. దీంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, బస్సుల సౌలభ్యంపై అధ్యయనం చేసేందుకు యోచిస్తున్నారు. దీనిపై ఈరోజు చర్చ కొనసాగనుంది.. ఈ నేపథ్యంలో ఆగస్టు 15వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించే అవకాశం ఉంది.

మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి నెలకు రూ.250 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మహిళలకు ఉచిత బస్సుల అమలు కోసం ప్రభుత్వం ప్రతి నెలా 25% వరకు నిధులను వ్యాపార సంస్థలకు కేటాయించాలి. ఆర్టీసీకి ప్రతి నెలా మరో రూ.125 కోట్లు ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.



























