Kirrak RP : ప్రముఖ నటుడు కిరాక్ ఆర్పీ తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి చెందిన నలుగురు ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. “వారు మనుషులేనా? లేక అడవి జంతువులా?” అంటూ ఆయన నిప్పులు చెరిగారు. కొమ్మినేని, కృష్ణంరాజుల లైవ్ డిబేట్లో ఏం జరిగిందో అందరూ చూశారని, అలాంటి పరిస్థితుల్లో కొమ్మినేని అరెస్టును అక్రమం అని ఎలా అంటారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.

అంతేకాదు, అమరావతి ఆడపడుచుల మానాలను అవమానిస్తుంటే ఆర్కే రోజా, లక్ష్మీపార్వతి, శ్యామల వంటి మహిళా నేతలు ఎక్కడ దాక్కున్నారని కిరాక్ ఆర్పీ నిలదీశారు. మహిళాభ్యుదయం గురించి మాట్లాడే వీళ్ళు, ఇలాంటి విషయాల్లో ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. భారతీరెడ్డి నడిపే మీడియాలో సాటి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.































