Astrologer Venu swamy : ప్రముఖ ఆస్ట్రాలజర్ అంటూ చెప్పుకుని తిరిగే వేణు స్వామి సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల జీవితాల్లో జరగబోయేవి ఇవే అంటూ ఎప్పటికప్పుడు చెబుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తుంటాడు. గతంలో ఇలాగే సమంత, నాగచైతన్య పెళ్లి సమయంలో వాళ్ళు విడిపోతారని చెప్పారు. ఇక రష్మిక తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పిందే నేనేనని తనతో వాళ్ళింట్లో ప్రత్యేక పూజలు కూడా చేసానంటూ చెప్పారు. ఇక మెగాస్టార్ కూతురు శ్రీజది వాళ్ళ బాబాయ్ జాతకం లాంటిదంటూ మూడో పెళ్లి చెసుకుంటుందంటూ మాట్లాడాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వైరల్ అవుతూ ఉండే వేణు స్వామి ఇటీవల ఒక స్టార్ హీరో చనిపోతాడని అలాగే ఒక హీరోయిన్ కి అనారోగ్యం వస్తుందని చెప్పాడు. ఇక ఇప్పుడు మరోసారి ఇద్దరు టాప్ హీరోలు చనిపోతారంటూ చెప్తున్నాడు. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

రాహుల్ గాంధీ పప్పు కాదు నిప్పు…
వేణుస్వామి గతంలోనే రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాడు అంటూ చెప్పారు. ఆయన ప్రధాని పీఠం మీద కూర్చోలేడని అలాగే పెళ్లి యోగం కూడా లేదని చెప్పారు. అయితే ఇపుడు వేణుస్వామి తాజాగా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ పప్పు అంటూ రాహుల్ గాంధీని అందరూ విమర్శిస్తారు. కానీ తాను మళ్ళీ కర్ణాటకలో కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చాడు. రేపు రాబోయే ఎన్నికలలో కూడా దేశంలో కీలకం అవుతాడు.

తాను అధికారంలోకి రాకపోవచ్చు కానీ రాజకియంగా కీలకం కానున్నాడు అంటూ వేణుస్వామి తెలిపారు. తెలంగాణ లో వచ్చే ఎన్నికలలో పోటీ బిఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్య ఉండబోతోంది. ఇక బీజేపీ మూడో స్థానములో ఉంటుంది అంటూ చెప్పారు. ఇక జగన్ అధికారంకి తిరుగులేదు కానీ ఎల్లపుడు జనం చేత తిట్టించుకోబడతాడు. అదే పవన్ విషయంలో సభ పెడితే ఇసక రాలనంత జనం వస్తారు. కానీ ఓట్లు మాత్రం రావు అంటూ చెప్పారు.

































