కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాడు. బిగ్ బాస్ ద్వారా కూడా అందరికీ సుపరిచితుడైన కత్తి మహేష్ ఎపుడు ఏదోక సమస్యను కొని తెచ్చుకుంటాడు. అలా చేసిన వ్యాఖ్యల కారణంగా ఒకసారి హైదరాబాద్ నుండి నగర బహిష్కరణకు కూడా గురి అయ్యాడు.. అయిన కూడా తన మాట తీరు మార్చుకోకుండా మళ్లీ అదే బాటలో నడుస్తున్నాడు. నగర బ్బహిస్కరణ తర్వాత గత కొంత కాలంగా అన్ని విషయాల్లో సైలెంట్ గా ఉన్నా మహేష్ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు.. మొన్న ఈ మధ్యనే రాముల వారు మీద చేసిన వ్యాఖ్యలకు పోలీస్ కేస్ నమోదు అయ్యింది ఈ బాగ్ బాస్ ఫేమ్ మీద.. ఈ విషయానికి హిందూ సంఘాల వారు మండి పడుతున్నారు మహేష్ మీద..
రాముడు మాంసం తింటడని, జింక మాంసం అంటే చాలా ఇష్టమని పురాణాలలో ఉందని అనడంతో హిందూ సంఘాల వారు అతని పై కేసు పెట్టారు.. అయినా పోలీస్ వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు కత్తి మహేష్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇదే సమయంలో మహేష్ ఎక్కడ కనిపిస్తాడా అని ఎదురు చూస్తున్న భజరంగ్ దళ్ సభ్యులు, మహేష్ ఐమాక్స్ కి వస్తున్న విషయం తెలుసుకొని దాడికి పాల్పడ్డారు.. విజయ్ దేవరకొండ నటించిన “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమా చూడడానికి ఐమాక్స్ కి వచ్చి వెళ్తున్న కత్తి మహేష్ మీద భజరంగ్ దళ్ సభ్యులు దాడి చేశారు.. కానీ సమాచారం అంది అక్కడికి పోలీస్ లు రావడం వల్లన మహేష్ తృటిలో తప్పించుకొని బయటపడ్డాడు.. ఈ దాడి లో కార్ అద్దాలు ధ్వంసం అయిన్నటు తెలుస్తుంది.. ఈ సంఘటన వలన ఐమాక్స్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొన్నది.




























