Categories: Featured

ఆ పాట నన్ను నిద్రపోనివ్వడం లేదు.. అనుష్క శర్మ?

ప్రస్తుతం ఏ సెలబ్రిటీ నోట చూసిన, ఏ సోషల్ మీడియాలో చూసిన వినిపించే పాట ఏమిటంటే..‘బచ్ పన్ కా ప్యార్ హై’ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పాటను చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాకు చెందిన హసదేవ్‌ డిర్డో అనే కుర్రాడు తన పాఠశాలలో పాడాడు.ఈ విధంగా స్కూల్ లో పాడిన పాటకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందడంతో చాలామంది రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. మరి సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఈ కుర్రాడు కూడా రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయాడు. ఈ బుడ్డోడు పాడిన ఈ పాట ఎంతో మంది నెటిజన్లను సెలబ్రిటీలను ఆకట్టుకుంది. ఇకపోతే ఈ బుడ్డోడు పాడిన పాటకు బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ కూడా ఫిదా అయ్యారు.

ఈ క్రమంలోనే అనుష్క శర్మ బుధవారం తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ఫన్నీ మీమ్‌ షేర్‌ చేశారు. రాత్రి ప్రశాంతంగా నిద్ర పోదాం అనుకుంటే.. ‘బచ్‌పన్‌ కా ప్యార్‌ హై’ అనే పాట నా నోటిలోనే నానుతూ నాకు నిద్రపట్ట నివ్వకుండా చేస్తోంది. అంటూ ఒక మీమ్‌ షేర్ చేశారు.ఎంత ప్రయత్నించినా ఆ పాటను తన మైండ్లో నుంచి తొలగించలేకపోతున్నానని ఈ సందర్భంగా నటి అనుష్క శర్మ ద్వారా తెలియజేశారు.

ప్రస్తుతం అనుష్క విరాట్ కోహ్లీతో కలిసి బ్రిటన్లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా అనుష్క శర్మ షేర్ చేసిన ఈ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే బుడ్డోడు హసదేవ్‌ డిర్డో పాడిన ఈ పాట పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక
చత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్ బాఘేల్ ఆ కుర్రాడిని తన వద్దకు పిలిపించుకుని పాట పాడించుకుని మరి విన్నారు. ఈ క్రమంలోనే కుర్రాడికి భవిష్యత్తు ఉంటుందని ముఖ్యమంత్రి ఆశీర్వదించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘బాహుబలి 3’ రానుందంటూ ప్రకటన..!

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన చిత్రాల్లో 'బాహుబలి'కి ప్రత్యేక స్థానం ఉంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ…

10 minutes ago

‘పెద్ది’ ప్రభావమా..? చరణ్-సుకుమార్ సినిమాకు బడ్జెట్ కత్తెర..?

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న అంశాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి సినిమా ఒకటి. దర్శకుడు…

30 minutes ago

తిరుమలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. ప్రతిరోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం..!

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో వచ్చే కుటుంబాలకు…

3 hours ago

పల్లీ వర్సెస్ బాదం..ఆరోగ్యానికి అసలు ఏది బెస్ట్?

ఆరోగ్యకరమైన ఆహారం గురించి మాట్లాడినప్పుడు ముందుగా గుర్తుకొచ్చే పదార్థాల్లో బాదం, వేరుశెనగలు తప్పకుండా ఉంటాయి. చాలా మంది ప్రతి రోజు…

3 hours ago

నటితో అనుసంధానం చేస్తూ సీఎం విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. మాజీ మంత్రిపై కేసు

తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…

22 hours ago

అరుదైన గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…

22 hours ago