ప్రస్తుతం ఏ సెలబ్రిటీ నోట చూసిన, ఏ సోషల్ మీడియాలో చూసిన వినిపించే పాట ఏమిటంటే..‘బచ్ పన్ కా ప్యార్ హై’ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పాటను చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాకు చెందిన హసదేవ్ డిర్డో అనే కుర్రాడు తన పాఠశాలలో పాడాడు.ఈ విధంగా స్కూల్ లో పాడిన పాటకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందడంతో చాలామంది రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. మరి సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఈ కుర్రాడు కూడా రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయాడు. ఈ బుడ్డోడు పాడిన ఈ పాట ఎంతో మంది నెటిజన్లను సెలబ్రిటీలను ఆకట్టుకుంది. ఇకపోతే ఈ బుడ్డోడు పాడిన పాటకు బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ కూడా ఫిదా అయ్యారు.
ఈ క్రమంలోనే అనుష్క శర్మ బుధవారం తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ఫన్నీ మీమ్ షేర్ చేశారు. రాత్రి ప్రశాంతంగా నిద్ర పోదాం అనుకుంటే.. ‘బచ్పన్ కా ప్యార్ హై’ అనే పాట నా నోటిలోనే నానుతూ నాకు నిద్రపట్ట నివ్వకుండా చేస్తోంది. అంటూ ఒక మీమ్ షేర్ చేశారు.ఎంత ప్రయత్నించినా ఆ పాటను తన మైండ్లో నుంచి తొలగించలేకపోతున్నానని ఈ సందర్భంగా నటి అనుష్క శర్మ ద్వారా తెలియజేశారు.
ప్రస్తుతం అనుష్క విరాట్ కోహ్లీతో కలిసి బ్రిటన్లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా అనుష్క శర్మ షేర్ చేసిన ఈ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే బుడ్డోడు హసదేవ్ డిర్డో పాడిన ఈ పాట పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక
చత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ ఆ కుర్రాడిని తన వద్దకు పిలిపించుకుని పాట పాడించుకుని మరి విన్నారు. ఈ క్రమంలోనే కుర్రాడికి భవిష్యత్తు ఉంటుందని ముఖ్యమంత్రి ఆశీర్వదించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…