Sukumar-Balakrishna: పుష్ప సినిమా ఇచ్చిన కిక్ తో డైరెక్టర్ సుకుమార్ సంతోషంగా ఉన్నారు. పుష్ప సినిమాకు అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. బాక్సీఫీస్ వద్ద కలెక్షన్లతో దమ్ము రేపుతోంది పుష్ప మూవీ. దీంతో సుకుమార్ ఇప్పుడు పుష్ప 2 తీసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల బాలకృష్ణ టాక్ షో ’ అన్ స్టాపబుల్‘ కు గెస్ట్ గా వచ్చారు.

సుకుమార్ తో పాటు.. హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మికా మందన్న కూడా బాలయ్య అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ లుగా వచ్చారు. ఇప్పటికే ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ’అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే‘ షో ఆహాలో విజయవంతంగా స్ట్రీమ్ అవుతోంది.

ఇప్పటికే మోహన్ బాబు, శ్రీకాంత్, బోయపాటి శ్రీను, రాజమౌళి లతో షో నిర్వహించిన బాలయ్య.. తాజాగా పుష్ప సినిమా టీంతో టాక్ షో చేశారు. దీంట్లో బాలకృష్ణ, సుకుమాణ మధ్య ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చాయి. ఈ షోలో తాను బాలకృష్ణ కు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చానని సంచలన కామెంట్లు చేశారు.
ఓ వైపు బాలకృష్ణ ఫోటో.. మరో వైపు చిరంజీవి ఫొటో…
మా ఊర్లో అప్పట్లో రెండే వర్గాలు ఉండేవని ఒకటి బాలకృష్ణ వర్గం కాగా.. మరొకటి చిరంజీవి వర్గం అని అన్నారు. మా ఇంట్లో కూడా ఇలానే ఉండేదని అని చెప్పారు. మా ఇంట్లో మొత్తం నలుగురు అన్నదమ్ములం అని.. అందరి కన్నా చిన్నవాడిని నేనని చెప్పారు. పెద్దన్నయ్య బాలకృష్ణ అభిమాని కాగా.. ఇద్దరు అన్నయ్యలు చిరంజీవి అభిమానులు అని చెప్పారు. ఇంట్లో ఓ వైపు బాలకృష్ణ ఫోటో ఉంటే మరోవైపు చిరంజీవి ఫోటో ఉండేదని.. ఎవరి సినిమా విడుదలైనా.. ఇంట్లో గొడవలు తప్పకపోయేవని చెప్పుకొచ్చారు సుకుమార్. మా పెద్దన్నయ్య మిమల్ని కలిశానంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతారని.. ఒక్కసారి నా తరపున పెద్దన్నయ్యకు ఐలవ్యూ చెప్పాలని సుకుమార్ బాలయ్యను కోరారు. తాను చూసిన బాలయ్యబాబు సినిమాలు హిట్ అయ్యాయని అన్నారు. దీంతో బాలకృష్ణ… నాతో సినిమాలు తీయకుండానే హిట్ కొట్టావని చమత్కరించారు.































