రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు వినూత్న ఐడియా తో ముందుకు వెళుతున్నారు సైబరాబాద్ పోలీసులు. సైబరాబాద్ పరిధిలో రోడ్డు పరమాడలు పెరుగుతున్న నేపధ్యంలో వాటిని అరికట్టేందుకు ప్రజలనే పోలీసులుగా మార్చేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.

ప్రజలే పోలీసులుగా మారి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి భరతం పట్టే చాన్స్ ఇస్తున్నారు పోలీసులు. సైబరాబాద్ పరిధిలో ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే వెంటనే ఫోటో లేదా వీడియో తీసి తేది, సమయం మరియు ప్రదేశం జత చేసి 94906 17346 నంబర్ కు వాట్సాప్ చేస్తే చాలు మిగిలింది పోలీసులు చూసుకుంటారు. అంతేకాదు మీ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతారు. మరి ఇంకేంటి ఆలస్యం వెంటనే పౌరపోలీసులుగా మారిపోయి నిబంధనలు పాటించని వారి భరతం పట్టండి.
Be citizen police.
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 5, 2021
Report a Traffic Violation. Capture the violation and send that image to Cyberabad E-challan WhatsApp: 9490617346 with Date, Time and Location. pic.twitter.com/F1e79Z1H5D