Connect with us

Featured

Bharath Gourav Tourist Express : భారత్ గౌరవ్ ట్రైన్ ప్రత్యేకతలు ఏమిటంటే… తొమ్మిది రోజులకు టికెట్టు ధర ఎంతంటే…: భారత్ గౌరవ్ ఎక్ష్ప్రెస్స్

Published

on

Bharath Gourav Tourist Express : దక్షిణ మధ్య రైల్వే కొత్తగా భారత్ గౌరవ్ ఎక్ష్ప్రెస్స్ పేరిట ఒక కొత్త రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా ఉత్తరాది పుణ్యక్షేత్రాల దర్శనం కోసం సికింద్రాబాద్ నుండి ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చారు. మార్చి 18న ప్రారంభమయిన ఈ రైలు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో మధ్యాహ్నం 12.00 గంటలకు బయల్దేరి, 8 రోజుల పాటు పూరీ, కోణార్క్‌, గయా, కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ల మీదుగా ప్రయాణిస్తుంది. మళ్ళీ తిరిగి 26వ తేదీ ఉదయం 6.00 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. ఏప్రిల్‌ 18న బయల్దేరే రెండో రైలు మధ్యాహ్నం 12.00 గంటలకు బయలుదేరి, యథావిధిగా దర్శనీయ ప్రాంతాలను చుట్టేసి ఏప్రిల్‌ 25వ తేదీ రాత్రి 11.00 గంటలకు తిరిగి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ రైలు లోని మరిన్ని ప్రత్యేకతలను తెలుసుకుందాం.

9 రోజుల ప్రయాణం… పుణ్యక్షేత్రాల దర్శనం…

భారత్ గౌరవ్ ఎక్ష్ప్రెస్స్ లో మొత్తం 700 సీట్లు ఉన్నాయి. 460 స్లీపర్ బెర్త్ లు, 192 థర్డ్‌ ఏసీ బెర్త్ లు, 48 సెకండ్‌ ఏసీ బెర్త్ లు ఉన్నాయి. ఈ యాత్రలో చూసే ప్రాంతలైతే పూరీ జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్యదేవాలయం, బీచ్, వారణాసి-కాశీ విశ్వనాథ్ దేవాలయం, కారిడార్, కాశీవిశాలాక్షి, అన్నపూర్ణదేవి దేవాలయం, సాయంత్రం గంగా హారతి, అయోధ్య రామ జన్మభూమి, సరయూ నది తీరాన హారతి, ప్రయాగరాజ్ -త్రివేణి సంగమం, హనుమాన్ మందిర్, శంకర్ విమన్ మందిరం తదితర దర్శనాలను భక్తులకు కల్పిస్తారు. యాత్ర 8 రాత్రులు, 9 రోజుల వరకు కొనసాగుతుంది.

Advertisement

700 సీట్లు కలిగిన ఈ ప్రత్యేక టూరిస్టు రైలులో యాత్రకు 3 వేర్వేరు ప్యాకేజీలుగా ధరను నిర్ణయించారు. స్లీపర్‌ తరగతి (ఎకానమీ)లో టికెట్‌ ధర ఒక్కొక్కరికి రూ.15,300(స్లీపర్‌), రూ.24,085 (థర్డ్‌ ఏసీ), రూ.31,500 (సెకండ్‌ ఏసీ) ఛార్జీలుగా నిర్ణయించారు. డబుల్‌/ట్రిపుల్‌ షేర్‌ రూ.13,955(స్లీపర్‌); రూ.22,510(థర్డ్‌ ఏసీ), రూ.29,615(సెకండ్‌ ఏసీ)గా నిర్ణయించారు. అదే 5-11 సంవత్సరాల మధ్య పిల్లలకైతే ఈ ధరలు వరుసగా రూ.13,060, రూ.21,460, రూ.28,360 చొప్పున ఉన్నాయి. సికింద్రాబాద్ లో బయలుదేరే ఈ ప్రత్యేక రైలు ద్వారా హిందూ పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకోవచ్చు. అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్‌లో ప్రారంభమైన రైలు పూరీ, కోణార్క్‌, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ల మీదుగా తిరిగి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ ప్రయాణ మార్గంలో సికింద్రాబాద్‌, కాజీపేట్‌, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం వంటి ప్రాంతాల్లో ఆగుతుంది.

Continue Reading
Advertisement

Featured

Magadheera: చరణ్ అభిమానులకు శుభవార్త.. థియేటర్లో రిలీజ్ కాబోతున్న.. ఎప్పుడో తెలుసా?

Published

on

Magadheera: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో విడుదల అయిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే తెలుగు థియేటర్స్ లో చాలా సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రభాస్ చిరంజీవి బాలకృష్ణ,రామ్ చరణ్,ఎన్టీఆర్ సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. పోకిరి నుంచి ఇప్పటిదాకా రీసెంట్ గా సమరసింహా రెడ్డిదాకా ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది. కొన్ని రీరిలీజ్ సినిమాలు బాగానే డబ్బు చేసుకోగా మరికొన్ని మాత్రం జనం పెద్దగా పట్టించుకోని పరిస్దితి ఏర్పడుతోంది.

ఆ సంగతి పక్కన పెడితే త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అన్న వివరాల్లోకి వెళితే.. మగధీర సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 27న చరణ్‌ బర్త్‌డే సందర్భంగా మగధీర చిత్రాన్ని 26న రీ రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించిన మగధీర 2009 జూలై 30న విడుదలై, బ్లాక్‌ బస్టర్‌ హిట్ గా నిలిచింది.

రీ రిలీజ్‌..

Advertisement

దాదాపుగా 14 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్‌ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌బాబు రీ రిలీజ్‌ చేస్తున్నారు. మగధీర చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్‌ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించాలి అని తెలిపారు యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌ బాబు.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: బోయపాటి డైరెక్షన్లో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. ఫిక్స్ చేసిన బాలయ్య?

Published

on

Mokshagna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. ఈయనకు వయస్సు మీద పడుతున్నప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక బాలయ్య వారసుడి రాక కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Mokshagna

మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ దాదాపు మూడు సంవత్సరాల నుంచి అభిమానులను ఊరిస్తూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఈయన సినీ ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ లేదు కానీ గత ఏడాది బాలయ్య మాట్లాడుతూ వచ్చే ఏడాది తన కుమారుడు సినీ ఎంట్రీ ఉంటుందని తెలిపారు.. ఇకపోతే మోక్షజ్ఞ ఎవరి డైరెక్షన్లో ఇండస్ట్రీకి పరిచయం అవుతారన్న సందేహాలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఒకసారి అనిల్ రావిపూడి పేరు వినిపించగా మరోసారి బోయపాటి పేరు కూడా తెరపైకి వచ్చింది.

ఇప్పటికే వీరిద్దరూ స్క్రిప్ట్ గురించి కూడా డిస్కషన్స్ పూర్తి చేశారని ఇక త్వరలోనే ఈ సినిమా పనులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇలా బాలయ్య తన కొడుకు ఎంట్రీ బోయపాటి పైనే భారం వేసారని తెలుస్తోంది ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

బోయపాటి పైనే భారం..
ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి తాజాగా మరొక వార్త వైరల్ గా మారింది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి టైం ఫిక్స్ చేశారని ఇక ఈయన బోయపాటి డైరెక్షన్ లోనే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలుస్తుంది. మాస్ సినిమాలకు బోయపాటి కేరాఫ్ అడ్రస్ తన కుమారుడి మొదటి సినిమా కూడా ఇలాంటి యాక్షన్ టచ్ ఇస్తేనే బాగుంటుందని భావించినటువంటి బాలయ్య బోయపాటిని ఫిక్స్ చేశారట.

Advertisement
Continue Reading

Featured

Venkata Chaitanya: ప్రతి ఒక్కటి తిరిగి ఇచ్చేయాల్సిందే.. వైరల్ అవుతున్న నిహారిక మాజీ భర్త పోస్ట్!

Published

on

Venkata Chaitanya: జొన్నలగడ్డ వెంకట చైతన్య పరిచయం అవసరం లేని పేరు మెగా డాటర్ నిహారిక మాజీ భర్తగా ఈయన ఎంత గుర్తింపు పొందారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి వీరిద్దరూ తమ వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ విధంగా నిహారిక ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె తన పెళ్లి విడాకులు అలాగే రెండో పెళ్లి గురించి కూడా కామెంట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇందుకు కౌంటర్ గా తన మాజీ భర్త సైలెన్స్ సైలెన్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

అయితే తాజాగా మరోసారి ఈయన సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈయన పరోక్షంగా నిహారికను ఉద్దేశిస్తూ తనకు కౌంటర్ ఇస్తూనే ఇలాంటి పోస్టులు చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అయినటువంటి చైతన్య తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

పాజిటివిటీని పెంచాలి..
చాలా రోజుల తర్వాత ఇలా మళ్లీ రాసుకు వస్తున్నాను. ఇంస్టా కమ్యూనిటీకి నా వల్ల అయినంతలో ఇలా చిన్నగా అయిన తిరిగి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. కొంచమైనా పాజిటివిటీని పెంచాలని అనుకుంటున్నాను అంటూ ఈయన పోస్ట్ చేయడంతో ఇది చూసినటువంటి నేటిజన్స్ కచ్చితంగా ఇది నిహారికను ఉద్దేశించి చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరు విడిపోయిన సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు ఇలా పరోక్షంగా సెటైర్లు వేసుకుంటూ పోస్ట్ చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!