తూర్పుగోదావరి జిల్లా, సామర్లకోట భీమేశ్వరస్వామి వారి ఆలయంలో.. మహా శివరాత్రి వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి. ఈ క్రమంలో మహాశివరాత్రి సందర్భంగా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో దాదాపు 20 వేలకు పైగా భక్తులు పాల్గొన్నారు. తిమ్మాపురం గ్రామానికి చెందిన కర్రీ వెంకటరాజు అనే వ్యక్తి… అయన తండ్రి సత్యనారాయణ పేరు మీద ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 20 సంవత్సరాలుగా భీమేశ్వవరస్వామి వారి సేవలో సత్యనారాయణ తరించారని, అయన స్వర్గస్తులైనా.. అయన కుమారుడు వెంటరాజు తన తండ్రి ఆశయాలను నిరవేరుస్తూ ఈ అన్నదానం నిర్వహించినట్టు తెలిపారు.
ఆధ్యాత్మికంగా పంచారామాల్లో ఒకటైన సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయం దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో ఒకటి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి 50కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి భీమేశ్వరుడిని కుమారస్వామి ప్రతిష్టించడం వల్ల కుమారారామ భీమేశ్వరం అనే పేరు వచ్చిందని చెబుతారు.





























