బుల్లితెరపై ఆదివారం ప్రసారమైన బిగ్ బాస్ కార్యక్రమంలోకి 19 మంది కంటెస్టెంట్ లు అడుగుపెట్టి ఆటను ఎంతో రసవత్తరంగా మొదలుపెట్టారు. ఇక ఈ సీజన్ లో అమ్మాయిల హవా కనిపిస్తుంది. ఇప్పటి వరకు అమ్మాయిలు 10 మంది, అబ్బాయిలు 9 మంది ఈ సీజన్ హౌస్లో ఉన్నారు. ఈ నేపధ్యంలో సింగర్ శ్రీరామ చంద్ర “గెలుపు తలుపులే తీసే..” అంటూ మంచి పాట పాడి అందరినీ అలరించాడు.

మరో వైపు ఇద్దరు అమ్మాయిలు హమీదా, బోల్డ్ బ్యూటీ సరయులు లోబోతో కలిసి దమ్ము కొట్టారు.. దమ్ముకోడుతూనే ఇంట్లో వారి గురించి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఇంటి సభ్యులలో కొందరితో ఇంట్లో కనెక్ట్ అవ్వలేమని.. వారితో బయటే కనెక్ట్ అవుతాం అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో హల చల్ చేస్తుంది. ఇది చూసిన నెటిజన్లు ‘అరె ఏంట్రా ఇది ? పొగ సెగ..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


































