Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కి పేద రైతులు దొరకలేదా.. ప్రైజ్ మనీ విషయంలో మోసం చేసినట్టేనా?

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు. ఒక సాధారణం వ్యక్తిలాగా బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగుపెట్టి అనంతరం సెలబ్రిటీగా మారినటువంటి పల్లవి ప్రశాంత్ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమంలో ఈయన ఆట తీరుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక ఈ కార్యక్రమానికి విన్నర్ గా నిలిచినటువంటి పల్లవి ప్రశాంత్ ఆ డబ్బును తాను వాడుకోనని పేద రైతులకు పంచుతానని మాట ఇచ్చారు. అయితే ఈయన బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి కూడా దాదాపు నాలుగు నెలలు అవుతుంది ఇప్పటివరకు పెద్దగా సహాయ కార్యక్రమాలు చేసిన సందర్భాలు మాత్రం కనిపించలేదు దీంతో ఈయన పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

ఈ విధంగా పల్లవి ప్రశాంత్ పట్ల విమర్శలు రావడంతో ఒక కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఏడాదికి సరిపడా బియ్యం కూడా అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోని కూడా ఈయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇకపై కూడా మరికొంతమంది రైతులకు తాను సహాయం చేస్తానని నేను చేసే సహాయానికి సంబంధించిన వీడియోలను అందరితో పంచుకుంటానని తెలిపారు.

డబ్బు పంచడం ఇష్టం లేదా..
ఇక ఈయన సహాయం చేసి కూడా చాలా రోజులు అవుతుంది. ఇప్పటివరకు మరో వీడియో షేర్ చేయలేదు. అయితే తాను పేద రైతులను గుర్తించి వారికి మాత్రమే సహాయం చేస్తానని తెలిపారు. ఇక తన ఇంటి వద్దకు ఎవరు కూడా సాయం చేయమని రావద్దని తానే పేదవారిని గుర్తించి సాయం చేస్తానని చెప్పారు. అయితే ఇప్పటివరకు ఈయన పేదవారిని గుర్తించలేకపోతున్నారా లేకపోతే డబ్బు పంచడం ఈయనకు ఇష్టం లేదా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.