Connect with us

Featured

బిగ్ బాస్‌ సీజన్ 4లో కొత్త హోస్ట్ – నాగార్జున స్థానంలో జేజమ్మ…?!

Published

on

‘బిగ్ బాస్’ పరిచయం అక్కర్లేని రియాల్టీ షో… ఈ షో తెలుగుతో పాటు అన్ని లోకల్ లాంగ్వేజ్ లలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ముందుగా హాలీవుడ్ లో ఆరంభమైన రియాల్టీ షో.. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 3 సీజన్లను పూర్తి చేసుకుంది. నాలుగో సీజన్ కూడా ఆసక్తికరంగానే సాగుతోంది.. ‘వాస్తవానికి ఈ షో మనసుషుల్లో ఉండే ఇతర రకాల సైకాలజీని స్టడీ చేసే ఒక ల్యాబరేటరీ’ అంటూ అరవంలో బిగ్ బాస్ షో సీజన్-1ను కమల్ హాసన్ ప్రారంభించే సమయంలో ఓ ప్రొఫెసర్ మాటలను గుర్తు చేశాడు. ఈ బిగ్ బాస్ షోను అన్ని భాషల్లోనూ ప్రారంభ షో నుండి హైప్ క్రియేట్ చేస్తున్నారు. అయితే దీనికి ఎందుకని ఇంతలా క్రేజ్ పెరుగుతోంది.. అసలు ఈ బిగ్ బాస్ కాన్సెప్ట్ ఎక్కడ స్టార్టయ్యింది.

మీడియా ఛానెల్స్, సోషల్ మీడియా వారు దీనిపై ఎందుకంత ఫోకస్ పెడుతున్నారనే విషయాలను పరిశీలిస్తే.. బిగ్ బాస్ రియాల్టీ షో కాన్సెప్ట్ ను నెదర్లాండ్స్ లోని డచ్ మీడియా కంపెనీ ద్వారా వెలుగులోకొచ్చింది. దీన్ని ఆ కంపెనీ అధినేత జాన్ డీ మోల్ జూనియర్ కనిపెట్టారు. 1999లో మొదటిసారిగా ‘బిగ్ బ్రదర్’ పేరుతో ప్రసారం అయ్యింది. సెలబ్రిటీల పర్సనల్ మ్యాటర్, వేష భాషలు, ప్రవర్తనను దగ్గరగా చూపించే ఈ బిగ్ బ్రదర్ రియాల్టీ షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సెలబ్రెటీలను మాములుగా ఉన్నప్పుడు చూసే ఛాన్స్ రావడంతో ప్రేక్షకులు ఈ షోని ఎగబడి చూసేశారు. ఈ కాన్సెప్ట్ ని దాదాపు 54 దేశాలు జాన్ డీ మోల్ జూనియర్ నుండి కొనేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. ఆయా దేశాలు ఈ షోని మొదలుపెట్టిన వెంటనే ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు టెలివిజన్ కు టీఆర్పీలని ఎక్కువగా తెచ్చేస్తోంది. దీంతో ప్రకటనల వ్యాపారం కోట్లలో జరిగింది. ఆ ప్రాఫిట్స్ లో సెలబ్రెటీలకు ఇచ్చే సొమ్ములు అసలు లెక్కలోకే రావు. అందుకే ఈ షోకు ప్రమోషన్ సైతం అదే స్థాయిలో ఉంటుంది. ఈ బిగ్ బాస్ షో వల్ల కేవలం టివి వాళ్లకు మాత్రమే లాభమనుకుంటే మీరు తప్పులే కాలేసినట్టే.

ఎందుకంటే దీని ఆధారంగా సోషల్ మీడియాలోనూ, టివి, యూట్యూబ్ లలోనూ చాలా వ్యాపారమే జరుగుతుంది. మీమ్స్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ పేజీలు, పెయిడ్ ఓటింగ్స్ చాలానే ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ షో విన్నర్ ఎవరంటూ ఇంతవరకూ బెట్టింగులైతే జరగలేదు కానీ.. ముంబైలో 2017 సంవత్సరంలో జరిగిన బిగ్ బాస్ షో విన్నర్ గురించి బెట్టింగులు కూడా బాగానే జరిగాయంట. అంతేకాదు బిగ్ బాస్ షోలో పాల్గొన్న సెలబ్రెటీలను యూట్యూబర్స్ కూడా బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. మొత్తానికి మనీ జనరేట్ చేసే కమర్షియల్ ఫార్ములా చుట్టూ జరిగే చిన్న వ్యాపారాలు చాలానే ఉన్నాయి. 2007లో ప్రసారమైన బిగ్ బ్రదర్ రియాల్టీ షోలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి ఇండియా నుండి ఓ సెలబ్రెటీగా పాల్గొన్నారు. అందులో ఆమెపై ఇంగ్లీష్ లేడీ చేసిన వివాదాస్పద కామెంట్స్ విపరీతంగా ట్రోల్ అయ్యాయి. దీంతో ఇంగ్లీష్ లేడీపై వ్యతిరేకత, శిల్పాశెట్టి మీద సింపతీ బాగా వర్కవుట్ అయ్యాయి. దీంతో ఆ సీజన్ టైటిల్ విన్నర్ గా శిల్పా నిలిచింది. ఇదిలా ఉంటే మన ఇండియాలో ఈ షో మొదటిసారిగా 2006లో ప్రారంభమైంది. ఆ తర్వాత శిల్పాశెట్టి, అమితాబ్, సల్మాన్, సంజయ్ దత్ ఈ షోలకు హోస్టుగా చేయడంతో దీనిపై క్రేజ్ ఓ రేంజ్ కు వెళ్లింది. కింగ్ ఆఫ్ రియాల్టీ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. ఇప్పుడిప్పుడే భారీగా ప్రేక్షకుల స్పందనను అందుకుంటోన్న బిగ్ బాస్ సీజన్ 4లో భారీ మార్పు జరగబోతుంది.

అదేమిటంటే.. దీనికి హోస్ట్ వ్యవహరిస్తున్న నాగ్ స్థానంలో ఓ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఏంటి షాక్ అయ్యారా.? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. వివరాల్లోకి వెళ్తే.. వారానికో సరికొత్త ట్విస్ట్ ఇస్తూ.. బిగ్ బాస్ సీజన్ 4 సరికొత్త టాస్కులు, లవ్ టాపిక్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌లు… ఇలా కొత్త కొత్త ప్లాన్లతో షోపై ఆసక్తిని పెంచే ప్రయత్నాలు చేస్తూ ప్రేక్షకుల నుండి భారీగా స్పందనను రాబడుతున్న నేపథ్యంలో బిగ్ బాస్‌ షోకు కొత్త హోస్ట్‌ రాబోతుందని తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆమె మరెవరో కాదు. గత పదేళ్లుగా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న సూపర్ హీరోయిన్ అనుష్క శెట్టి.. బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటివరకూ హోస్ట్‌గా ఉన్న నాగార్జున స్థానాన్ని ఆమె భర్తీ చేయబోతుందని, బహుశా ఈ శనివారం కానీ.. ఆదివారం కానీ మన బాహుబలి హీరోయిన్ అనుష్క ఈ షోలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తాజా సమాచారం. ఇంతకీ బిగ్ బాస్ షోలో హోస్ట్ మారడం వెనుక అసలు కథ ఏమిటంటే.. అనుష్క ఈమధ్యనే ‘నిశ్శబ్ధం’ అనే చిత్రంలో నటించింది. అది అక్టోబర్ 2న అమెజాన్‌లో విడుదల కాబోతుంది.

దీని ప్రమోషన్‌లో భాగంగానే నాగార్జున స్థానంలో అనుష్క హోస్ట్ గా బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇస్తుందని, రానున్న ఎపిసోడ్‌ను నాగ్ కాకుండా అనుష్క ఓపెన్ చేసి సర్‌ప్రైజ్ చేయబోతుందని తెలిసింది. దీంతో ఒక్కసారిగా బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్‌ లేటెస్ట్ షో పై ఆసక్తి పెరిగిపోతోంది. బిగ్ బాస్ సీజన్ 3లో కూడా గతంలో అక్కినేని నాగార్జున… తన బర్త్ డే వేడుకల కోసం ఫామిలీ మెంబర్స్ తో కలిసి విదేశాలకు వెళ్లిన టైములో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరించింది. ఆమె హోస్ట్ గా చేసింది 2 ఎపిసోడ్సే అయినా బుల్లితెర ప్రేక్షకులను రమ్యకృష్ణ ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా ఆమె హోస్ట్ గా వ్యవహరించిన ఆ 2 ఎపిసోడ్స్‌కు భారీ స్థాయిలో రేటింగ్ కూడా వచ్చింది. ఆదండి సంగతి.. మొత్తానికి నిశ్శబ్దం గా ఎంట్రీ ఇవ్వబోతున్న అనుష్క బిగ్ బాస్ షో ఎలా ఉండబోతుందో బుల్లితెరపై మీరే చూడండి..

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!