BJP leader Chittibabu: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ అలానే బీజేపీ రెండు నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహారిస్తున్నాయి. పొలిటికల్ హీట్ ను పెంచుతూ తాజాగా బండి సంజయ్ అరెస్టు రాష్ట్రవ్యాప్తంగా కాక పుట్టించింది. నిజానికి రేపో మాపో కెసిఆర్ కూతురు ఎమ్మెల్సి కవితక్క అరెస్టు అంటూ బాగా చర్చలు జరిగినా చివరికి బీజేపీ రాష్ట్ర నాయకుడు బండి సంజయ్ ను ఉన్నపళంగా అరెస్టు చేయడంతో ఇప్పుడు ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే విషయం గురించి సీనియర్ ప్రొడ్యూసర్ అలాగే బీజేపీ లీడర్ చిట్టిబాబు మాట్లాడారు.

తెలంగాణలో కెసిఆర్ అధికార దుర్వినియోగం చేస్తున్నారు…
కవిత లిక్కర్ స్కాంలో సీబీఐ విచారణ ఎదుర్కోవడం అందులో ఇప్పటికే విచారణకు హాజరవడం జరిగింది. దీంతో ఈ విషయాన్ని అస్త్రంగా తెలంగాణలో ప్రతిపక్షాలు వాడుతూ కవిత జైలుకి పోతుందని ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంతలో పేపర్ లీకేజి వ్యవహారం బయటపడటం అందులో ఇప్పటికే కొంతమంది విచారణ ఎదుర్కోంటుండగా అనూహ్యంగా ఇందులోకి బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకుడు బండి సంజయ్ పేరు రావడం రాత్రికి రాత్రే అరెస్టు చేయడం జరిగింది.

అయితే ఈ విషయం గురించి చిట్టిబాబు మాట్లాడుతూ అరెస్టు అయి కొన్ని గంటలు దాటతున్నా ఏ సెక్షన్స్ కింద ఆరెస్టు చేసారు, ఏ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు వంటి విషయాలను చెప్పలేదు. కావాలని కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోంది బిఆర్ఎస్ ప్రభుత్వం అంటూ తెలిపారు చిట్టిబాబు. వినశాకాలే విపరీత బుద్ధి అని బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ అరాచకాలే ప్రజలు వారికి బుద్ధి చెప్పేలా చేస్తాయని తెలిపారు. ఇప్పటికే బీజేపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నట్లు చెప్పారు. మొదట లిక్కర్ స్కాంలో ఉన్న కూతురిని వదిలేసి బండి సంజయ్ ను అరెస్టు చేయడం కేవలం విషయాన్ని పక్కకు మల్లించడానికే అంటూ తెలిపారు.



































