Featured

బ్లాక్ ఫంగస్ నుంచి మీ కళ్లను ఇలా కాపాడుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!

Published

on

దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులతో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది బ్లాక్ ఫంగస్ బారినపడి కంటిచూపును మరి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. బ్లాక్ ఫంగస్ ముందుగా కంటి పై దాడి చేసే కంటిచూపును కోల్పోయేలా చేస్తుంది. అయితే బ్లాక్ ఫంగస్ ప్రతి ఒక్కరిలోనూ వ్యాపించి ప్రమాదానికి గురి చేయదు.

ఎవరి శరీరంలో అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, ఎవరైతే బలహీనంగా ఉండి మధుమేహం, అవయవ దానం, మూత్రపిండ సమస్యలు వంటి వాటితో బాధపడే వారిలో ఎక్కువగా బ్లాక్ ఫంగస్ సోకే అవకాశం ఉంటుంది.అయితే మన శరీరంలో రోగనిరోధక శక్తి అధికంగా ఉన్నప్పుడు బ్లాక్ ఫంగస్ బారిన పడకుండా ఉండవచ్చు.ఈ క్రమంలోనే మన శరీరంలో అధిక మొత్తం రోగనిరోధక శక్తి ఉండాలి. రోగ నిరోధక శక్తి పెరగాలంటే తప్పకుండా పోషక పదార్థాలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. మరి ఆహార పదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

చేపలు: చేపలలో ఎక్కువభాగం విటమిన్లు పోషక పదార్థాలతో కూడి ఉంటుంది. అందువల్ల చేపలను,ముఖ్యంగా సముద్ర చేపలను తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి.

Advertisement

గుడ్లు: గుడ్లు పోషకాల నిలయం అని చెప్పవచ్చు.ల్యుటెయిన్, జీజాంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు గుడ్లలో ఉంటాయి. రోజూ ఉడకబెట్టిన గుడ్లు తీసుకోవడం వల్ల మన శరీరానికి అధిక మొత్తంలో రోగనిరోధక శక్తిని పొందవచ్చు.

నట్స్: బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా వంటి వాటిలో అధిక మొత్తం ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఈ విధమైనటువంటి వాటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

తాజా కూరగాయలు, ఆకుకూరలు: తాజా కూరలు, కాయగూరలలో ఎక్కువ భాగం విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. ఇవి మన శరీరానికి కావల్సినంత రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడతాయి. ఈ విధమైన ఆహార పదార్థాలు మాత్రమే కాకుండా అధిక భాగం ధాన్యాలు, పప్పు దినుసులు, తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

Advertisement

సిట్రస్ జాతి పండ్లు: మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని పెంచడంలో సిట్రస్ జాతి పండ్లు ఎంతగానో దోహదపడ్డాయి.ఈ పండ్లలో అధిక మొత్తంలో విటమిన్ సి ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Advertisement

Trending

Exit mobile version