ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ (98) అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన ముంబై లోని హిందూజ హాస్పిటల్ కు తరలించారు ఆయన కుటుంబ సభ్యులు. గత కొద్ది రోజులుగా దిలీప్ కుమార్ శ్వాస సంబందిత వ్యాదితో బాధపడుతున్నట్లు ఆయన భార్య సైరా బాను మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని ప్రముఖ వైద్యుడు డాక్టర్ జలీల్ పార్కర్ పర్యవేక్షిస్తున్నారు.

గత నెలలో కూడా ఆయన సాధారణ పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరారు. గతేడాది కరోనా మహమ్మారి ధాటికి అయన ఇద్దరు సోదరులు అస్లాంఖాన్ (88) ఎషాన్ ఖాన్ (90) మరణించారు. 1944లో ‘జ్వార్ భాటా’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తరువాత వరుస విజయాలతో స్టార్ డం సంపాదించారు. ఆయనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకున్నారు.



























