ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ భార్య విడాకుల కోసం దాఖలు చేసింది. కరోనా లాక్ డౌన్ వలన అన్ని సేవలు రద్దవడంతో.. అలియా విడాకులను నోటీసులను మే7న వాట్సాప్ మరియు ఈమెయిల్ ద్వారా పంపించారు.

ఈ విషయంపై నవాజ్ ఏమీ స్పందించకపౌవడంతో అతని భార్య నవాజ్ పై జూలై 27 న
వెర్సోవా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. అంతేకాకుండా నవాజుద్దీన్ కుటుంబం మొత్తం మీద సంచలనమైన కామెంట్స్ చేసింది. నటుడు నవాజుద్దీన్ సోదరుడు మినాజుద్దీన్ సిద్దిఖీని నిందిస్తూ, ఆమె తన నివేదికలో “నా మేనకోడలు అతను మామయ్యతో కలిసి పంపించవద్దని చెప్పాడు, ఎందుకంటే అతను తప్పుడు చర్యలకు పాల్పడ్డాడు. ఆ అమ్మాయి తనంటే ఇష్టం లేదని చెప్పింది. ఆ అమ్మాయి అలా చెప్పిన టైంలో నేను అతనిని మొదటిసారిగా అనుమానించాను.

2012 లో తన బావ మినాజుద్దీన్ తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, తన కుమార్తెకు అశ్లీల చిత్రాలు చూపించ బడ్డాయని, తన బావపై తన అసంతృప్తిని వ్యక్తం చేసినా, అతను ఆమెను కొట్టాడని” అని ఆలియా తన FIR లో తెలియ జేసింది. ఆలియా FIR నమోదు చేసిన టైంలో నవాజుద్దీన్ ముంబైలో ఉన్నాడు. ఇంతవరకు ఆలియా చేసిన సంచలన కామెంట్స్ పై నవాజ్ నుండి ఎటువంటి స్పందన రాలేదు.



























