బాలీవుడ్ చిత్ర యువ నటుడుగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.. తాజాగా యువ హీరో సుశాంత్ ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్ళే సమయానికే అయన మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే ఆయన ఆత్మహత్యకు కి గల కారణం ఇంకా తెలియలేదు. అయిదు రోజుల క్రితమే ఆయన మాజీ మేనేజర్ దిశా సెలియన్ సూసైడ్ చేసుకున్న సంగతి విదితమే.. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కు సంబంధించి వివరాలు తెలియవలసి ఉంది.

సుశాంత్ సింగ్ ప్రముఖ క్రికెటర్ అయిన మహేంద్ర సింగ్ ధోని జీవితం ఆధారంగా తెరకెక్కించిన దోని చిత్రంలో ధోని పాత్ర పోషించాడు. ఈ యువ హీరో ఆత్మహత్యకు పాల్పడటం బాలివుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది.




























