బాలీవుడ్ ధోనీగా ప్రసిద్ధి చెందిన యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి నెల రోజులు గడుస్తున్నా.. ఫ్యాన్స్ మాత్రం ఇంకా ఆయన ధ్యాసలోనే ఉన్నారు. తమ అభిమాన నటుడు ఎందుకు చనిపోయాడా.? అనే సందేహాలకు సరైన సమాధానం దొరకక సతమతమౌతున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ చక్కని నటుడు మాత్రమే కాదు స్టూడెంట్ నెం.1 కూడా.! అతను దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం నిర్వహించిన AIEEE పరీక్షలో ఆల్ ఇండియా టాప్ 7 వ ర్యాంకర్, ఆ తర్వాత తన కలలను నెరవేర్చుకోవడానికి 4వ సంవత్సరంలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. పాట్నాలో జన్మించిన సుశాంత్ కు నలుగురు సోదరీమణులు. అతను వారి ఏకైక సోదరుడు. అతని తండ్రి ప్రభుత్వ అధికారి. అతను 12వ తరగతి చదువుతున్నప్పుడు తల్లిని కోల్పోయాడు. తన సోషల్ మీడియా పేజీలలో అప్పుడప్పుడు తన తల్లి కోసం ఎమోషనల్ మరియు హార్ట్ టచింగ్ పోస్టులను పోస్ట్ చేస్తూ ఉంటాడు, ఈ పోస్టులు సుశాంత్ తన తల్లిని ఎంతగా మిస్ అవుతున్నాడో తెలియ జేస్తుండేవి. సుశాంత్ ను బుల్లితెరకు పరిచయం చేసింది పవిత్ర రిష్టా అని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ‘కిస్ దేశ్ మె హై దిల్ మేరా’ సీరియల్లో ప్రీత్ జునేజా పాత్రతో సుశాంత్ తన నటనా జీవితాన్ని ప్రారంభించాడన్న సంగతి చాలామందికి తెలియదు.
ప్రముఖ నటుడు షియామాక్ దావర్ మరియు ఆష్లే లోబో బృందంతో కలిసి నృత్య కార్యక్రమాలలో పాల్గొనే వాడు, అలన్ అమిన్ నుండి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. ప్రఖ్యాత దర్శకుడు మోహిత్ సూరికి తన చిత్రం రాజ్ 2 షూటింగ్ సందర్భంగా ఆర్థిక సాయం చేశాడు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ గత నెల 14న ఆయన తన ఇంట్లోనే బలవాన్మరనానికి పాల్పడ్డారు. సుశాంత్ మరణాన్ని అతని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. హీరోగా మంచి కెరీర్ ను వదిలేసి ఇలా అర్ధాంతరంగా చనిపోవాల్సిన అవసరం సుశాంత్ కు లేదని.. ఆయన్ని ఎవరో పక్కా ప్లాన్ ప్రకారమే చంపేసారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ సుశాంత్ నిజంగానే సూసైడ్ చేసుకుని ఉంటే ఎందుకు ఈ కేసులో సాక్ష్యాధారాలను ప్రజల ముందుకు తీసుకురావడం లేదని గట్టిగానే అడుగుతున్నారు ఫ్యాన్స్.
ఈ క్రమంలోనే సుశాంత్ ఆత్మతో సంప్రదించాలని ప్రముఖ పారానార్మల్ యాక్టివిస్ట్ స్టీవ్ హుఫ్కు కొద్దిరోజులుగా ఫ్యాన్స్, నెటిజన్లు ఈ- మెయిల్స్, మెసేజ్స్ పంపడంతో ఆయన.. జూలై 13వ తేదీన ఆస్ట్రల్ డోర్ వే సహాయంతో సుశాంత్ ఆత్మను సంప్రదించాడు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను తన ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్స్లో కూడా షేర్ చేశాడు. అందులో స్టీవ్ పలు ప్రశ్నలను సంధించాడు. ఆ వీడియోలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ”సుశాంత్ నన్ను గుర్తుపట్టారా” అని స్టీవ్ అడగడం, దానికి ఎస్ఎస్ఆర్, “మీరు నన్ను అనుమతించారు” అని సమాధానం చెప్పడంతో ఈ వీడియో మొదలవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ లో మాత్రం మరిన్ని సందేహాలు రెట్టింపయ్యాయి.
Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.
ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.
Advertisement
ఇష్టమైన ఫుడ్ తింటారు.. ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.
Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.
త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.
Advertisement
పార్టీలకు వెళ్లడం మానుకున్న.. ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.
ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Advertisement
క్విజ్ కాంటెస్ట్.. ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.