Connect with us

Featured

Anu Aggarwal : ప్రపంచం మొత్తం దాసోహమన్న ఆ హీరోయిన్ పరిస్థితి ఎంత ధారుణంగా మారిందో తెలుసా?

Published

on

Anu Aggarwal : అను అగర్వాల్… ఒకప్పుడు ఈమె బాలీవుడ్లో తిరుగులేని రారాణిగా ప్రఖ్యాతి చెందింది. ఆషీకీ ఈ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఆమె మొదటి సినిమాతోనే బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దేశంలోని ప్రతి సినిమా ప్రేక్షకులకి ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. అను అగర్వాల్ జనవరి 11, 1969 న ఈవిడ జన్మించారు. ఈవిడ 1990 సంవత్సరంలో ఆషీకీ సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్. ఆ సినిమా 2 సంగతులను మనకు ఇచ్చింది. అందులో మొదటిది ఎప్పుడు మరిచిపోలేని పాటలు, మరొకరు హీరోయిన్ అను అగర్వాల్. అయితే ఈ సినిమా చేయకముందు అను అగర్వాల్ తను అసలు ఎప్పుడూ హీరోయిన్ కావాలని అని అనుకోలేదు. అయితే దర్శకుడు మహేష్ భట్ ప్రోత్సాహంతోనే ఆవిడ సినీ పరిశ్రమలోకి వచ్చింది. ఆషీకీ సినిమాను ముందుగా తనకు వివరించిన తను ఒప్పుకోలేదు. కాకపోతే ఏడు నెలల తర్వాత మళ్లీ మహేష్ భట్ అను అగర్వాల్ కు ఫోన్ చేసి నువ్వు ఈ సినిమా చేయకపోతే నేను ఈ సినిమా తీయను అని చెప్పడంతో ఆమె ఆ సినిమాల్లో నటించింది.

అయితే ప్రస్తుతం ఈవిడ ఎక్కడ ఉంది ఏం చేస్తున్నారు అన్న సంగతి విషయానికొస్తే…. నిజానికి ఈమె జీవితం అచ్చం సినిమా స్టోరీలా ఉంటుంది. మొదటగా ఈవిడ జన్మించింది ఢిల్లీలో. కానీ తల్లిదండ్రుల కారణంగా ఆవిడ చెన్నైలో కొద్ది రోజులు ఉండగా మళ్ళీ తిరిగి ఢిల్లీలో సోషియాలజీ సబ్జెక్టులో డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించింది. ఆ సమయంలోనే ఆవిడ మంచి అందగత్తె అవడంతో స్వతహాగా సినీ ఇండస్ట్రీలోకి లేదా మోడలింగ్ లో వెళితే తన భవిష్యత్తు బాగుంటుందని అప్పట్లో తన స్నేహితులు ఆమెకు తెలియజేశారు. దీనితో ఆవిడకు ముందుగా సినిమాలు చేయడానికి ఇష్టం లేకున్నా మోడలింగ్ చేద్దామని తను ముంబైకి వచ్చింది. ఆ తరుణంలో కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు మోడల్ గా పని కూడా పని చేసింది. 1988వ సంవత్సరంలో దూరదర్శన్ ఛానల్లో వీడియో జాకీగా ఆకట్టుకుంది. అప్పట్లో ఆమె అభినయం అందం చూసి వద్దు వద్దు అన్న గాని సినిమా ఆఫర్లు ఆమెకు వెంటనే వచ్చాయి. ఇక ఇదే తరుణంలో 1990 సంవత్సరంలో మహేష్ బాబు నిర్మించిన ఆశిక్ ఈ సినిమా ద్వారా తన సినీ ప్రస్థానం మొదలు పెట్టింది. అయితే ఆ సినిమా తర్వాత ఇక ప్రతి డైరెక్టర్ ఆమెతో సినిమా తీయాలని బారులుతీరారు. కానీ అవన్నీ ఆమె పక్కన పెట్టి వరల్డ్ టూర్ వెళ్లి వచ్చాక మంచి పాత్రలు ఉన్న సినిమాలు చేయాలని భావించి వాళ్ళు టూర్ కి వెళ్ళిపోయింది. అలా వెళ్లొచ్చాక ఆవిడ డేట్స్ ఇస్తే చాలు అన్నట్లుగా ఆమె అడిగినంత పారితోషకం ఇవ్వడానికి దర్శక నిర్మాతలు సిద్ధమైపోయారు.

ఇలా అనేక సినిమాల్లో ఆమెకు ఛాన్స్ వచ్చినా కేవలం తనకు నచ్చిన సినిమాలోనే ఎంచుకొని సంవత్సరానికి ఒక సినిమా లాగే సినిమాలు చేస్తూ వచ్చారు. అలాగే 1993వ సంవత్సరంలో స్టార్ డైరెక్టర్ మణిరత్నం తో తమిళంలో తిరుధ తిరుధా అనే సినిమా, అదేనండి మన తెలుగు లో దొంగ దొంగ సినిమా పేరుతో వచ్చిన సినిమాని అప్పుడు ఆమె అంగీకరించింది. ఆ సినిమాలోని కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి అన్న పాట ఇప్పటికీ మనకు సుపరిచితమే. అయితే ఇక 1994వ సంవత్సరంలో మన తెలుగు డైరెక్టర్ అయినా మణి కౌల్ అనే దర్శకుడు ది క్లౌడ్ డోర్ అనే ఇండో-జర్మన్ సినిమాని తీశారు. ఇక ఆ సినిమాలో అను అగర్వాల్ పూర్తిగా న్యూడ్ గా నటించింది. అప్పట్లో అది పెద్ద సెన్సేషన్ గా కూడా మారింది. దీనితో ఆ సినిమా మా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా కేన్స్ చిత్రోత్సవాల్లో కూడా ఆ సినిమాను ప్రదర్శించడం జరిగింది.

అలా కొద్దిగా సినిమాలు చేస్తూ చేస్తూ ఆమెకు సినిమా అంటేనే కాస్త బోర్ కొట్టడంతో అలా కొన్ని రోజులు హిమాలయాలకు వెళ్లి తిరిగి వచ్చి మళ్ళీ సినిమాలు చేద్దాం అనుకుని ఉన్న రోజుల్లో ఆమెకు ముంబైలో అనుకోని విధంగా భారీ యాక్సిడెంట్ జరిగింది. ఇక ఆ ఆక్సిడెంట్ లో అను అగర్వాల్ పూర్తిగా దెబ్బలు తగిలి కోమాలోకి వెళ్లి పోయింది. ఇక శరీరంలో మొత్తం ఇరవై తొమ్మిది చోట్ల ఎముకలు విరిగి అయితే ఆమె పరిస్థితి అర్థం చేసుకోండి. అనేక శస్త్రచికిత్సలు, అనేక మంది డాక్టర్ల నిపుణుల సూచనల మేరకు ఆరు సంవత్సరాల తర్వాత ఆమె కోలుకోవడం జరిగింది. యాక్సిడెంట్ జరిగిన ఆరు నెలల వరకు ఆమె కోమాలోనే ఉండిపోయింది. కోమాలో నుంచి బయటికి వచ్చిన ఆమె ముఖం ఆమె చూసుకోవడానికి చాలా భయపడింది. అలాంటి సంఘటన నుంచి బయటికి తేరుకొని చూడగానే ఆమెకు పూర్తిగా తన గతాన్ని మర్చి పోయింది.

ఆరు సంవత్సరాలు గడిచిన తరువాత ఆమెకు తన గతాన్ని గుర్తుకు వచ్చింది. ఆ ఆరు సంవత్సరాల్లో ఆమె నరకం భూమి మీద ఉండగానే చూసిందని అని చెప్పవచ్చు. తన కుడిచేయి పని చేయకపోవడంతో ఆవిడ పనులన్నీ ఎడమ చేతితోనే చేసుకునేది. ఆ తర్వాత యోగతో తన ఒత్తిడిని పూర్తిగా తొలగించుకుంది. ఇక ఆమె తన శరీరంతో పెద్ద యుద్ధమే చేసిందని చెప్పవచ్చు. అనూ ఫన్ అని యోగ పేరుతో సొంతంగా ఒక హీలింగ్ పద్ధతిని తయారుచేసింది. ఆ తరువాత వైద్యుల సహకారంతో పూర్తి మనిషి అయింది ఆవిడ. యోగ, తాంత్రిక సెక్స్ తనను మాములు మనిషిని చేసిందని తన తర్వాత రచించిన ఆత్మకథలో వివరంగా చెప్పింది. ఇక ఆ తరువాత ముంబైలోని కొన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉన్న ప్రజలను, పిల్లలను పలకరిస్తూ వారికి యోగా, జీవితం పట్ల సూచనలు ఇస్తుంది. ఇలా ఆవిడ ప్రస్తుత జీవితం ముంబైలో కొనసాగిస్తుంది. అయితే ఇంతకు ముందు సినిమాలు చేసిన ఆమెతో వారు ఇప్పుడు ఆమెను చూస్తే అసలు గుర్తు పట్టలేదు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

AP Politics: కూటమికి మద్దతుగా మెగాస్టార్ .. జగన్ కి ఇది ఊహించని షాక్!

Published

on

AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.

ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.

Advertisement

మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే..
ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పవన్ సభలో కత్తులు కలకలం.. పోలీసుల అదుపులోకి ఇద్దరు యువకులు?

Published

on

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.

ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.

Advertisement

దాడికి ప్రయత్నమా..
ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.

Advertisement
Continue Reading

Featured

AP Politics: గులకరాయికే విలవిలలాడితే గొడ్డలి పోటు సంగతి ఏంటి జగనన్న: షర్మిల

Published

on

AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.

ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.

Advertisement

కంచుకోటకు బీటలు..
ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!