బాలీవుడ్ లో హీరోయిన్లకు ప్రాముఖ్యత ఉండే సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. ఒకవేళ లేడీ ఒరియెంటెడ్ సినిమాలు వచ్చినా పెద్దగా ఆకట్టుకుంటాయా అన్నది డౌట్. అయితే ఈ విషయంలో ఈమధ్య కాలంలో చాలా మార్పులొచ్చాయనే చెప్పవచ్చు. ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు బాలీవుడ్ లో లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చాలా వస్తున్నాయి.
ఈ మధ్యనే విడుదలైన కంగనా రనౌత్ క్వీన్, దీపికా పాడుకొనే పద్మావతి సినిమాలు ఈ కోవలోకి వచ్చేవే. దీపికా పాడుకొనే లీడ్ రోల్ చేసిన పద్మావతి సినిమా సూపర్ హిట్టైంది. అంతేకాదు.. ఏకంగా రూ.600 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది దీపికా. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు టాప్ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉంటూ.. రెండు చేతులా సంపాదిస్తున్న దీపికా తన ఖాతాలో మరో అరుదైన రికార్డును వేసుకుంది. 2018 లో అత్యధిక బ్రాండ్ వ్యాల్యూ సాధించిన ఇండియన్ సెలెబ్స్ లో దీపికా రెండో స్థానంలో నిలిచింది.
ఇన్ని ఘనతలు సాధించిన బాలీవుడ్ క్వీన్ దీపికా మన టాలీవుడ్ లో కూడా ఒక సినిమాలో నటించింది. అదీ ఓ ఐటెం సాంగ్ లో వెండితెరపై తన డాన్స్ ఫెర్ఫామెన్స్ ను చూపించింది. కాకపోతే మన తెలుగు ప్రేక్షకుల దురదృష్టమో ఏమో కానీ ఇప్పటి వరకూ ఆ సినిమా వెలుగులోకి రాలేదు. ఏంటి.. నమ్మడం లేదా..?! బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే తెలుగు సినిమా ఎప్పుడు చేసిందబ్బా అని బుర్ర గోక్కుంటున్నారా..? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న తొలిరోజుల్లో చాలా మంది బాలీవుడ్ హీరోయిన్ల లాగే దీపిక కూడా ఓ తెలుగు సినిమాలో నటించింది. అయితే ఆ మూవీ ఇంతవరకూ విడుదలకు నోచుకోలేదు.
అంతేకాదండోయ్.. ఆ సినిమాను డైరెక్ట్ చేసింది కూడా టాలీవుడ్ లో బాగా పేరున్న జయంత్ సి పరాన్జీ అంటే నమ్మశక్యంగా లేదు కదూ..!. ఇదంతా పదేళ్ల క్రితం జరిగింది కాబట్టి మీరు నమ్మరులెండి.. అప్పట్లో ఈ అందాల తార ఇంకా బాలీవుడ్కు వెళ్లలేదు. ఒక్క బాలీవుడ్, టాలీవుడ్ లోనే కాకుండా.. కన్నడలో కూడా ఉపేంద్ర సరసన హీరోయిన్గా నటించింది. ఇక ఆ రోజుల్లో దీపికా నటించిన ఏకైక తెలుగు చిత్రం కోసం చెప్పాలంటే.. జయంత్ తెరకెక్కించిన “లవ్ 4 ఎవర్” సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది దీపిక. కానీ ఈ సినిమా ఎందుకనో ఇంతవరకూ విడుదల కాలేదు. ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ కూడా విడుదలయ్యాయి కానీ పాటను విడుదల చేయలేదు దర్శకుడు జయంత్ సి పరాన్జీ. ఆ తర్వాత ఆమె బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. షారుక్ ఖాన్ ఓం శాంతి ఓం సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది దీపిక. ఇక ఆ తర్వాత ఆమె బాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.