“విలన్” అనే పదానికి సరైన అర్థాన్ని ఇస్తూ తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి బాలీవుడ్ మరియు టాలీవుడ్ చిత్రాలలో విలన్ గా క్రేజ్ ను సంపాదించుకున్న మహానుబావుడు “అమ్రిష్ పురి”. ఈ రోజు ఆయన పుట్టినరోజు సంధర్బంగా ఒక్కసారి ఆయన సినీ జ్ణాపకాలను గుర్తు చేసుకుందాం..
1932లో పంజాబ్లో జన్మించిన అమ్రిష్ పురి తన 39వ ఏట సినిమాల్లో అడుగుపెట్టారు. అనేక సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలే పోషించిన అమ్రిష్.. తెలుగు సినీ చరిత్రలో గొప్ప విలన్గా గుర్తుండిపోయారు. 1954లో ఓ సినిమాలో లీడ్ రోల్కు అమ్రిష్ పురిని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర నుంచి తప్పించారు. చాలా కాలం పాటు డబ్బింగ్ చెప్పిన అమ్రిష్.. 1971లో రేష్మ ఔర్ షెరా సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత బాలీవుడ్ లో చాలా చిత్రాలలో నటించిన అమ్రిష్ పురి చిరంజీవి హీరోగా నటించిన కొండవీటి దొంగ సినిమాలో ఖాద్రా పాత్రలో హిప్నటైజ్ చేస్తూ డైలాగ్స్ చెప్పే పాత్ర తో టాలీవుడ్ లో బాగా పాపులరయ్యారు. అమ్రిష్ పురి వాయిస్ మాడ్యులేషన్ కి మాత్రమే సెట్ అయ్యేలా ఉంటుంది. అది ఆయన గొప్పతనం.
అలాగే జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో “మహా దృష్ట్య పాళికా కపాళికా” అనే డైలాగ్ మోస్ట్ పవర్ ఫుల్ గా సినిమాకే హైలెట్ గా నిలిచి. అప్పట్లో ఈ డైలాగ్ వినగానే థియేటర్లలో అరుపులు కేకలతో రీసౌండ్ వచ్చేది. ఈవిధంగా అమ్రిష్ పురి ఏ డైలాగ్ పలికిన ఆ చెప్పేవిధానంలో ఓ వైవిధ్యం, వాయిస్ లో వినబడే కఠినత్వం, వృత్తికే అంకితమనిపించే ఆ సాధన మెండుగా కనబడతాయి. జగదేకవీరుడు అతిలోక సుందరిలో మాంత్రికుడుగా, చిరంజీవికి సైతం స్క్రీన్ మీద పోటీగా అంతటి ఎనర్జీ పెర్ఫార్మన్స్ ను ఇచ్చారంటే.. అమ్రిష్ పురి ఎంట్రీ కు ముందు, ఎంట్రీ తర్వాత అనేలా ఈ సినిమా ఉంటుంది. తెలుగులో ఈయన సినీ ప్రస్థానం చూస్తే దాదాపు అన్ని మెజీషియన్ గాను, మాంత్రికుడిగానే ఆకట్టుకున్నారు.
బాలకృష్ణ నటించిన “నిప్పు రవ్వ” చిత్రంలో బలగం అనే పాత్రలో బొగ్గు గని యజమానిగా, అవినీతి వంతుడైన రాజకీయ నాయకుడిగాను తన విలక్షణ నటనతో సినిమా విజయంలో ముఖ్య పాత్రను పోషించారు. “పగలు ప్రజారాజ్యానికి అధిపతిని, రాత్రి చీకటి రాజ్యానికి అధినేతని. ”ఈ డైలాగ్ ని అమ్రిష్ పురి వాయిస్ లో ఊహించుకోండి. మన Sr.ఎన్టీఆర్ సినిమా లో విలన్ ఏ రేంజ్ లో ఉండాలో, అంతకు మించి MP జ్ఞానేశ్వర్ రావు పాత్రలో అమ్రిష్ పూరి ఇమిడిపోయి, అద్భుతమైన డైలాగ్ డెలివరీ తో తనదైన ముద్ర వేశారు.
బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకూ భారీగా రెమ్యునరేషన్ తీసుకునే బెస్ట్ విలన్ మన అమ్రిష్ పురి. అసలు విలన్ పాత్రలకు సరైన అర్థం చెప్పిందే అమ్రిష్ పురి అంటే అతిశయోక్తి కాదేమో.! అలాగే బాలీవుడ్ లో అమ్రిష్ పురి సినీ ప్రయాణాన్ని గమనిస్తే అనిల్ కపూర్ హీరోగా నటించిన మిస్టర్ ఇండియా సినిమాలోని “మొగాంబో కో కుష్ హువ’. అనే డైలాగ్ బాగా పాపులరైంది. “జా సిమ్రన్ జా. జీలే అ ప్ ని జిందగీ.” దిల్వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాలో ఈ డైలాగ్ ని ఎవరైనా, ఎప్పటికైనా మరిచి పోగలరా? షారుఖ్ ఖాన్, కాజోల్ జోడి కి ఎంత మంచి పేరు వచ్చిందో, కాజోల్ కి కఠినమైన తండ్రి పాత్రలో అమ్రిష్ పూరి కి అంతకు మించి పేరు వచ్చింది.
అబితాబ్ బచ్చన్ “షహెన్షా” సినిమాలో మెయిన్ విలన్ గా బిగ్ బి నే డామినేట్ చేసారంటే, ఆ విలన్ పాత్రలో ఎంత బాగా నటించారో మనం అర్ధం చేస్కోవచ్చు. ఈయన చేసిన పాత్రలు ఇప్పటికి ప్రేక్షకుల మదిలో పదిలంగా ఉండడానికి కారణం ఈయన పాత్రలకు ఈయనే డబ్బింగ్ చెప్పుకోవడమే. ఈయన చేసిన సినిమాల్లో హీరో డైలాగ్స్ కంటే, ఈయన డైలాగ్స్ కే ప్రేక్షుకులు మంత్రముగ్దులయ్యేవారు. హిందీతో పాటు, తెలుగు, తమిళ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళీ భాషల్లో దాదాపు 400లకు పైగా చిత్రాల్లో నటించారు. హాలీవుడ్లోనూ కొన్ని సినిమాల్లో నటించారు. ‘అమ్రిష్ పురి నా ఫేవరెట్ విలన్’ అని హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్బర్గ్ చెప్పడం విశేషం. అయితే తెలుగులో నటిస్తున్న సమయంలో ఒక తెలుగు హీరో ఆయన్ని అవమానించాడని ఇకపై చచ్చినా తెలుగులో నటించానని ప్రకటించారు.. ఆ హీరో ఎవరనే దానిపై ఆప్పట్లో కొన్నిపేర్లు కూడా వినిపించాయి. ఏది ఏమైనా అంతటి ఘనత సాధించిన ఆ మహానటుడు అనారోగ్యంతో 2005లో కన్నుమూశారు. వెండితెరపై అమ్రిష్ పూరి లేని లోటును పూర్చేవారు ఎవ్వరూ లేరు.. రాలేరు.. రాబోరు.
Pitapuram: ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఎన్నికల హడావిడి మొదలైనప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అందరి చూపు పిఠాపురం నియోజకవర్గం పైనే ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరి జెండా ఎగురుతుందన్న విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇలా పిఠాపురం పైన ఇంత ఆసక్తి రావడానికి కారణం అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే కారణమని చెప్పాలి.
గత ఎన్నికలలో భీమవరం గాజువాకలో పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం కాపులు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు ఈ క్రమంలోనే ఈయనకు పోటీగా వైసిపి పార్టీ నుంచి వంగా గీత ఎన్నికల బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ ఎవరు గెలుస్తారో అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఇప్పటికే ఎన్నో చానల్స్ వారు ప్రజా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. వంగా గీత కూడా అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ అంతేకాకుండా ప్రస్తుతం కాకినాడ ఎంపీగా కూడా ఈమె కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో వంగా గీత కాకుండా పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.
Advertisement
జనసేనదే విజయమా.. ఇకపోతే వంగా గీత 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగి పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు అయితే అప్పట్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిన పిఠాపురానికి చేయాల్సినటువంటి న్యాయం చేయలేకపోయారని అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతున్నామంటూ చాలామంది ప్రజలు పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేస్తున్నారంటూ పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి చూడాలి మరి పిఠాపురంలో ఏ జెండా ఎగురుతుంది వంగా గీత పవన్ కళ్యాణ్ కి ఎలా పోటీగా నిలబడతారు అనేది తెలియాల్సి ఉంది.
AP politics: రేపు ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఎలాంటి పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి దిగిపోతుంది కానీ తెలుగుదేశం పార్టీతో జనసేన బిజెపి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే ఇలా కూటమిగా ఏర్పడి ఎన్నికలలో గెలిచి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపించాలని ధ్యేయంగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు వెల్లడించారు.
ఇలా ఈ మూడు పార్టీల కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగుతున్నటువంటి తరుణంలో కొన్ని నియోజకవర్గాలలో పార్టీల కోసం ఎంతో కష్టపడినటువంటి వారికి సీట్లు రాకపోవడంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోనే జనసేనలోనూ కూడా అభ్యర్థులు అలకలు మొదలుపెట్టారు. ఇటీవల బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ వెస్ట్ సీటు జనసేన పార్టీకే కేటాయిస్తారని, పార్టీ తరపున తనకే సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న పోతిన మహేష్ ఈ సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో చాలా అసంతృప్తికి గురయ్యారు.
ఇలా బిజెపికి సేటు కేటాయించడంతో మహేష్ ఏకంగా జనసేన పార్టీ కార్యాలయం ముందు రెండు గంటల పాటు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈయనని పవన్ కళ్యాణ్ పిలిపించుకొని తనని బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు పదవి తప్పకుండా ఇస్తామని చెప్పిన మహేష్ మాత్రం తనకు టికెట్ కావాలని కోరారు.
Advertisement
పొత్తు ధర్మాన్ని పాటించండి.. ఇలా అభ్యర్థులు సహకరించకపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.పొత్తు ధర్మాన్ని పాటిద్దామని కూటమిని గెలిపిద్దామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రెస్నోట్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. ఆ పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
AP Politics: ఏపీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ బస్సు యాత్రలో భాగంగా ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ సభలో తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో రాష్ట్ర తెలుసనీ, తన చెల్లెలు షర్మిల సునీతను కూడా తమ రాజకీయాలలో పావులుగా వాడుకున్నారని తెలిపారు.
నా చెల్లెమ్మలు ఇద్దరూ కూడా హంతకులకే మద్దతు తెలుపుతున్నారని జగన్ మండిపడ్డారు. చెల్లెమ్మలు చిన్నాన్నను చంపిన వారితో చేతులు కలపగా నేను మాత్రం ప్రజల పక్షమే ఉంటానని జగన్ తెలిపారు. ఇలాంటి హంతకులతో అవినీతిపరులతో యుద్ధం చేయడానికి ఈ అర్జునుడు సిద్ధం మీరు సిద్ధమేనా అంటూ ఈ కార్యక్రమంలో జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.
Advertisement
కూటమి అంటే కుట్రలు.. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు నాయుడికి 45 ఏళ్ల అనుభవం ఉందని చెప్పారు. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి చంపి, ఆయన విగ్రహాలకు పూలమాలలు వేశారని అన్నారు. కూటమి అంటే కుట్రలు కుతంత్రాలని జగన్ తెలిపారు. తమ జెండా మాత్రం మరో జెండాతో జతకట్టలేదని చెప్పారు. కేంద్రం నుంచి ఓ పార్టీని తెచ్చుకున్నారని అన్నారు. ఇటీవల చోటుచేసుకున్న డ్రగ్స్ కేసు వెనుక చంద్రబాబు వదిన గారి చుట్టం ఉన్నారంటూ డ్రగ్స్ వ్యవహారంపై కూడా జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.