హైదరాబాదులో బాంబు పేలుడు సంఘటన చోటు చేసుకుంది. శనివారం రాంనగర్ లోని వైట్ హౌస్ హోటల్ సమీపంలో జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. హోటల్ సమీపంలో ఉన్న ఒక చెత్తకుండీలో పేలుడు సంభవించినట్టు పోలీసులు గుర్తించారు. సమీపంలోని చెత్త కుండీ వద్ద చేత ఏరుకునే వ్యక్తికీ తీవ్ర గాయాలయ్యాయి. జరిగిన ఘటనకు రాంనగర్ వాసులు ఉలిక్కి పడ్డారు. సదరు వ్యక్తి చెత్త ఏరుకునే సమయంలో అతని చేతిలో ఉన్న బాక్స్ ఒక్కసారిగా పేలడంతో పేలుడు సంభవించిందని ప్రాధమిక సమాచారం. అయితే పేలుడు ఘటన తెలుసుకున్న పోలీసులు హుటాహుటియన సంఘటన జరిగిన ప్రాంతానికి వచ్చారు. డాగ్ స్క్వాడ్ ను తెప్పించి చుట్టుపక్కల ప్రాంతాలలో తనికీలు చేపట్టారు. గాయాల పాలైన వ్యక్తిని హుటా హుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ హాస్పిటల్ లో ఆ వ్యక్తికీ చికిత్స అందిస్తున్నారు. చెత్తకుండీలో పడేసిన డబ్బా పేలిందని పోలీసులు ప్రాధమికంగా భావిస్తున్నారు. అసలు ఆ డబ్బా ఎక్కడనుంచి వచ్చింది. అందులో ఏముంది అనేదానిపై విచారణ జారుతుంది.
అసలే దేశంలో ఎక్కడ ఎటువంటి విద్రోహ చర్య జరిగినా, తీవ్ర వాదులు చెలరేగినా వారికి మూలాలు ఏదో ఒక రూపంలో హైదరాబాద్ లో ఉండటం, హైదరాబాద్ నుండి వారికి ఏదో ఒకరకమైన సహకారం లభించడం గత కొంన్నేళ్ళుగా చూస్తూనే ఉన్నాం. ఒక వంక ఉగ్రవాదులకు, మరో వంక మావోయిస్టు లకు ఇక్కడ వారి పన్నాగాలు అనుగుణంగా భావిస్తున్నారు.



























