హర్యానా రాష్ట్రంలో బహదూర్గఢ్ లో హితేష్, ఝాన్వి దంపతులు తమ ఆరేళ్ల కుమారుడు కలిసి నివసిస్తున్నారు. అయితే ఆ కుర్రాడికి టైఫాయిడ్ జ్వరం రావడంతో కొద్దిరోజులు ఇంటి వద్దనే చికిత్స అందించారు. అయితే అప్పటికీ టైఫాయిడ్ తగ్గకపోవడంతో ఆ పిల్లాడ్ని ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకుకేల్లారు. అయితే ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ ఆ పిల్లాడు మే 26న చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. దానితో కనీరు మునీరైన తల్లిదండ్రులు చిన్నారి మృతదేహంతో సొంతూరుకు తిరిగొచ్చారు. అక్కడ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

ఆ సమయంలో కొడుకు మృతదేహాన్ని పట్టుకుని ఏడుస్తూ ఆ తల్లి అటూ ఇటూ కదిపింది. దాంతో పిల్లాడి శరీరంలో ఒక్కసారిగా కదలిక కనిపించింది. దానితో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులు వెంటనే తేరుకుని పిల్లాడి శరీరాన్ని ప్యాకింగ్ నుంచి వేరు చేసి నోటి ద్వారా శ్వాస అందించాడు తండ్రి హితేష్. ఈ క్రమంలో పొరుగింటి యువకుడు పిల్లాడి ఛాతీపై గట్టిగా ఒత్తడంతో ఒక్కసారి పిల్లాడి గుండె కొట్టుకోవడం ప్రారంభమైంది.































